ఘనంగా భాగ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు.ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ.

0
1K

జగద్గిరిగుట్ట: భాగ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు బుధవారం ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగద్గిరిగుట్ట ఏఎస్ఐ నన్నేమియా హాజరయ్యారు. జన్మదినం సందర్భంగా మాణిక్య చారి తన వంతు సహాయంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకులను, అలాగే మానసిక వికలాంగుడికి ఒక సంవత్సరం సరిపడా డైపర్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన జన్మదిన వేడుకల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రంలో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, అశోక సంఘం అధ్యక్షులు ఏసుబాబు, మదర్ తెరిసా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, రమ, విజయ్ శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
International
అమెరికా–చైనా చదరంగంలో భారతీయుడు పావులా మారాడు |
అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ మూలాల NRIపై గూఢచర్యం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి....
By Bhuvaneswari Shanaga 2025-10-17 07:48:49 0 58
Telangana
ఆరోగ్య బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పలువురు...
By Sidhu Maroju 2025-06-12 11:27:57 0 1K
Telangana
బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ
బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సామాన్య ప్రజలతో పాటు,...
By Sidhu Maroju 2025-06-09 10:35:07 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com