ఘనంగా భాగ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు.ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ.
Posted 2025-06-19 13:43:28
0
1K
జగద్గిరిగుట్ట: భాగ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు బుధవారం ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగద్గిరిగుట్ట ఏఎస్ఐ నన్నేమియా హాజరయ్యారు. జన్మదినం సందర్భంగా మాణిక్య చారి తన వంతు సహాయంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకులను, అలాగే మానసిక వికలాంగుడికి ఒక సంవత్సరం సరిపడా డైపర్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన జన్మదిన వేడుకల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రంలో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, అశోక సంఘం అధ్యక్షులు ఏసుబాబు, మదర్ తెరిసా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, రమ, విజయ్ శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Andhra Pradesh Boosts Tourism Through Heritage and Nature
Andhra Pradesh continues to promote tourism by enhancing its rich blend of spiritual, cultural,...
పుంగనూరు: పొంచి ఉన్న పెను ప్రమాదం కొత్తూరు మురళి
పుంగనూరులోని పుంగమ్మ చెరువు కట్టపై బుధవారం రాత్రి మున్సిపల్ ట్యాంక్ నిండి విద్యుత్...
నిజామాబాద్: వైన్స్ షాపులకు దేవులా పెర్లు పెటకుండ చట్టం తెవాలి ఎమ్మెల్యే ధనపాల్సూర్యనారాయణ
వైన్షపులకు దేవుల పెర్లు తోలాగిన్చెలా, కొత్తగపేటకుండ చాటముటిసుకురవాలాని.ఎమ్మెల్యే...
మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయుటకు ఏర్పాటుచేసిన విజయోత్సవ సభ
మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి –...
*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం :
*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం : తెలీకాన్ఫరెన్స్ లో పల్లా శ్రీనివాస్ రావు*
*4...