గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

0
1K

సికింద్రాబాద్.. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. గత నెల రోజులుగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఆదేశాల మేరకు తెలంగాణలోని నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును పరిశీలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలోని కొన్ని విభాగాలలో పెరుగుతూ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆస్పత్రి వైద్య యంత్రాంగం నుండి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సూపరిండెంట్ రాజకుమారితో గాంధీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి చర్చించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో తాగునీటి సరఫరా సరిగా లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూపర్డెంట్ కు సూచించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ లోపం లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిటీ స్కాన్, ఎమ్మారై యంత్రాలు పనిచేసే విధంగా చూడాలని రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని సూపరిండెంట్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానని స్పష్టం చేశారు.ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నీటి కొరత: ట్యాంకర్ల ద్వారా సరఫరా.
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు తాత్కాలిక చర్యలు...
By Pagadala Venkateswar 2026-04-08 13:58:55 0 122
Andhra Pradesh
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భవన కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు....
By Pagadala Venkateswar 2026-05-16 05:08:28 0 85
Business & Finance
Gold Prices Stay High in Goa
Gold prices in Goa remained elevated on 29 June, with 24-carat gold priced at ₹1,51,360 per 10...
By Navya Sree 2026-06-29 06:01:52 0 74
Tamilnadu
Tamil Nadu Launches 300 New Buses to Boost Connectivity
Tamil Nadu has strengthened its public transportation network with the launch of 300 new...
By Navya Sree 2026-06-25 13:03:32 0 62
Andhra Pradesh
Nara Lokesh: యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా సంబరాలు.
మంత్రి నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్‌...
By Pagadala Venkateswar 2026-01-27 06:44:53 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com