గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

0
1K

సికింద్రాబాద్.. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. గత నెల రోజులుగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఆదేశాల మేరకు తెలంగాణలోని నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును పరిశీలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలోని కొన్ని విభాగాలలో పెరుగుతూ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆస్పత్రి వైద్య యంత్రాంగం నుండి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సూపరిండెంట్ రాజకుమారితో గాంధీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి చర్చించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో తాగునీటి సరఫరా సరిగా లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూపర్డెంట్ కు సూచించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ లోపం లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిటీ స్కాన్, ఎమ్మారై యంత్రాలు పనిచేసే విధంగా చూడాలని రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని సూపరిండెంట్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానని స్పష్టం చేశారు.ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Bharat Aawaz: India's Voice of Change
Bharat Aawaz: India's Voice of Change Bharat Aawaz isn't just a media platform; it's a movement...
By Bharat Aawaz 2025-07-17 04:58:31 0 1K
Jammu & Kashmir
Nagrota Intrusion Foiled; India Responds Firmly to Ceasefire Violations Amid Tensions
Nagrota Intrusion Foiled; India Responds Firmly to Ceasefire Violations Amid Tensions An...
By BMA ADMIN 2025-05-22 18:23:27 0 2K
Telangana
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్షలు - సంఘీభావం తెలిపిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత దీక్షలు అల్వాల్ జెఎసి ప్రాంగణంలో...
By Sidhu Maroju 2025-06-30 14:33:19 0 882
Nagaland
Dimapur Smart City Project Picks Up Pace with Green Initiatives
Under the Smart Cities Mission, Dimapur is witnessing a wave of transformation. The...
By Bharat Aawaz 2025-07-17 11:08:28 0 896
Technology
BSNL Launches Gold International Roaming Plan: Stay Connected in 18 Countries at Just ₹180/Day
BSNL Launches Gold International Roaming Plan: Stay Connected in 18 Countries at Just ₹180/Day...
By BMA ADMIN 2025-05-22 18:03:45 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com