బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

0
1K

  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా నడికట్ల రోజాను నియమించారు. శనివారం గండి మైసమ్మ బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా నడికట్ల రోజా మాట్లాడుతూ... పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని, తనకిచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, ఆకుల విజయ్, రెడ్డం రాజేశ్వరి, వెంకటేష్ నాయక్, ఆంజనేయులు, విగ్నేష్ చారి, ఆకుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల...
By BABJI DADALA 2026-02-09 09:24:22 0 50
Media Academy
Modern Media & Journalism:
In the rapidly evolving digital age, journalism has undergone a remarkable transformation,...
By Media Academy 2025-05-01 06:17:39 0 3K
Madhya Pradesh
NEET UG 2025 MP Counselling Starts Today
The second round of NEET UG 2025 counselling has begun in Madhya Pradesh. Candidates can check...
By Pooja Patil 2025-09-15 05:37:02 0 120
Telangana
నరకంగా మారిన రాత్రి ప్రయాణం
రాత్రి 7 గంటల దాటిన తర్వాత వాహనాలు నడుపాలంటే భయమేస్తుంది ఎదురుగా వచ్చే వాహనాల led light వల్ల...
By Bouth Arun 2026-02-11 04:16:41 0 125
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com