సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల వద్ద ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద క్యూలైన్లో వివాదం చోటుచేసుకుంది...
ప్రసాదం కొనుగోలు చేసే భక్తులు , ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అది తీవ్ర వివాదంగా కొనసాగింది.. ప్రసాదం తీసుకునేందుకు విచ్చేసిన
భక్తులు వారిలో వారు దాడి చేసుకోవడంతో అక్కడ ఉన్న దేవస్థానం సిబ్బంది వారిని నియంత్రించడంలో విఫలం అయ్యారు..
క్యూలైన్ నియంత్రించాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఈ గొడవ ఎక్కువ సమయం కొనసాగినట్లుగా తెలుస్తుంది... భక్తులు రద్దిగా ఉండే రోజుల్లో కూడా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేయక పోవడంతో ఈ వివాదాలకు దారితీసిందని, అన్నవరం దేవస్థానంలో వరుసగా పలు వివాద సంఘటనలు చోటు చేసుకుంటున్న నిర్లక్ష్యం వహిస్తున్న ఆలయ EO ను వెంటనే సస్పెండ్ చేయాలని పలువురు భక్తులు డిమాండ్ చేసారు... #dadala babji
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz