బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

0
1K

  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా నడికట్ల రోజాను నియమించారు. శనివారం గండి మైసమ్మ బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా నడికట్ల రోజా మాట్లాడుతూ... పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని, తనకిచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, ఆకుల విజయ్, రెడ్డం రాజేశ్వరి, వెంకటేష్ నాయక్, ఆంజనేయులు, విగ్నేష్ చారి, ఆకుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఎమ్మార్వో హామీతో దీక్ష విరమించిన దళిత సంఘాలు
పుంగనూరు మండలం, రాంపల్లి గ్రామ సమీపంలో మహేష్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్ల భూమిని...
By Kothuru Murali 2026-03-02 12:33:11 0 71
Andhra Pradesh
ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర గిరిక పోటీలు కడిమెట్ల గ్రామంలో
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అంతర్ రాష్ట్ర గిరిక పోటీలు ఘనంగా...
By Boya Dasthagiri 2026-04-03 07:26:24 0 142
Andhra Pradesh
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా క్రిస్మస్ వేడుకలు
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్:   దుబాయ్ లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో...
By Rajini Kumari 2025-12-22 07:30:33 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com