కట్టు కాలువ సర్వేపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం

0
38

హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని మైలారం దాదాపు వందల ఎకరాలను వరద ముప్పు నుండి కాపాడే కట్టు కాలువ నేడు ఆక్రమణలకు గురై చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.సుమారు 30 ఫీట్ల వెడల్పు గల ఈ కాలువ మరియు రోడ్డు గురించి గత 12 సంవత్సరాల నుండి దారి లేని రైతులు పోరాడుతూనే ఉన్నారు.కానీ రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదు.రెవెన్యూ నక్ష లో ఉన్న కాలువ, రోడ్డు కబ్జాకు గురవుతున్నప్పుడు లేదా భూ సమస్యలపై ఫిర్యాదులు చేసినప్పుడు క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సరిగ్గా స్పందించకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మండల వ్యాప్తంగా ఇలాంటి నిర్లక్షలాపై రైతుల నుండి తీవ్ర ఆగ్రహం వెల్లడవుతుంది. మైలారం గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉంటూ శ్రీరాముల రాజయ్య భూమి వరకు ఉన్న కట్టు కాలువ,రోడ్డు పనుల నిమిత్తం వచ్చే సర్వే అధికారులను గత కొన్ని సంవత్సరాలుగా కొందరు రైతులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాలతో ఆర్డీవో మరియు ఎమ్మార్వో అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన కట్టుకాలువ సర్వే కేవలం డిప్యూటీ సర్వేయర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సర్వేయర్లను పెట్టి తూతూ మంత్రంగా చేసి వెళ్లిపోవడం చర్చనీయంచమైంది. కేవలం సగం మాత్రమే సర్వే చేసిన డివిజన్ సర్వేయర్ మిగతా ప్రాంతాన్ని సర్వే చేయడానికి కారణాలు వెతుక్కుని వెళ్ళిపోయాడు. దీనిపై పరకాల ఆర్డీవో వెంకన్నను సోమవారం ప్రజావాణిలో రైతులు అడుగగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆర్డీవో కనీసం గత 12 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యకు పరిష్కారం చెప్పకుండా రైతులే సమస్యను పరిష్కరించుకోవాలని,లేనిచో రెవెన్యూ అధికారులు రారని రైతులను వెనుతిప్పారు.కావున జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Search
Categories
Read More
Assam
Assam Strengthens Flood Management and Disaster Relief
Assam has intensified its flood management and disaster relief measures to reduce recurring...
By Fathima Safa 2026-07-01 05:34:15 0 84
Andhra Pradesh
ఎమర్జెన్సీ గేటు పోస్టుమార్టం గది రెండు గేట్లు నిర్మించేందుకు ప్రహరీ గోడను బంకులను జేసిబి తొలగిస్తున్న అధికారులు
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఆంధ్రప్రదేశ్  వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య...
By Chennaiah Kati 2026-01-09 04:54:37 0 308
Telangana
ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి.
Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు...
By Ponnala Srinivasrao 2026-05-03 16:53:32 0 113
Telangana
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  బోయిన్ పల్లి వార్డు 6 అరవెల్లి ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్...
By Sidhu Maroju 2025-08-17 07:39:47 0 609
Andhra Pradesh
మీ వార్డులో - మీ ఎమ్మెల్యే' కార్యక్రమంలో షాజహాన్ బాషా.
మదనపల్లె పట్టణంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా 'మీ వార్డులో - మీ ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా సోమవారం...
By Pagadala Venkateswar 2026-06-30 07:06:51 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com