తెలుగుదేశం పార్టీలో చేరిన 150 వైసీపీనుండి కార్యకర్తలు

0
42

*అన్నమయ్య జిల్లా*

*రాయచోటి నియోజకవర్గం*

*లక్కిరెడ్డిపల్లె మండలం*

*18-07-2026*

 

*మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం... దప్పేపల్లెలో 150 మంది టీడీపీ గూటికి*

 

*తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*

 

లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె గ్రామానికి చెందిన *మాజీ ఎంపీటీసీ,మాజీ జడ్పీటీసీ అంబా బత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు* తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాహిత పాలనకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు.

 

ఈ సందర్భంగా *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు* నూతనంగా పార్టీలో చేరిన వారికి *పార్టీ కండువాలు* కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

 

మంత్రి గారు మాట్లాడుతూ, *ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో* రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితంగానే అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా *తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని* పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బలిశెట్టి హరిప్రసాద్ గారు, *మండల పార్టీ అధ్యక్షులు మదన్ మోహన్ గారు,* ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన వారిని అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం.
  గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం...
By Pagadala Venkateswar 2026-04-10 06:37:24 0 105
Maharashtra
Maharashtra Drives Industrial Development and Investments
Maharashtra continues to strengthen its position as India's leading industrial and investment...
By Fathima Safa 2026-07-06 08:16:31 0 83
Telangana
నిజామాబాద్: గోమాతను జాతీయప్రాణిగా ప్రకటించాలి
గో మాతను జాతీయ ప్రాణి గా ప్రకటించారని నవీపేట్ లో శోభా యాత్రగా ప్రధాన వీధుల గుండా వెళ్లి...
By Sadaq Sadaq 2026-04-27 16:10:03 0 139
Telangana
పెద్దపల్లి మార్కెట్ యార్డులో మక్కలు చోరీ...!
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విఎస్, ఎమ్మెల్యే...
By Sunka Santhosh 2026-05-07 03:57:42 0 128
SURAKSHA
Pragya Richa Srivastava: Leading Emergency Response
A distinguished 1991-batch IPS officer of the Madhya Pradesh cadre, Shri Pragya Richa Srivastava...
By Lokeshwari Panthadi 2026-07-23 06:08:35 0 24
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com