Madanapalle: మదనపల్లె బస్టాండ్‌లో 48 గ్రాముల బంగారు నెక్లెస్ పోగొట్టుకున్న బాధితురాలు. వెంటనే స్పందించి గంటలోపే నెక్లెస్‌ను గుర్తించి అప్పగించిన 2 టౌన్ పోలీసులు.

0
28

మదనపల్లె: మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో పోగొట్టుకున్న సుమారు 48 గ్రాముల బంగారు నెక్లెస్‌ను మదనపల్లె 2 టౌన్ పోలీసులు చాకచక్యంగా గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఈ ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి తమ సమయస్ఫూర్తిని చాటుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరి మండలం చౌకుపాలెంకు చెందిన ఖాదరబీ తన భర్త ఫక్రుద్దీన్‌తో కలిసి కలికిరిలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు కదిరి నుంచి బస్సులో మదనపల్లెకు చేరుకున్నారు. అనంతరం కలికిరి బస్సు కోసం ఆర్టీసీ బస్టాండ్‌లో వేచి ఉండగా, ఆమె మెడలో ఉన్న బంగారు నెక్లెస్ అనుకోకుండా పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న బాధితురాలు వెంటనే మదనపల్లె 2 టౌన్ పోలీసులను ఆశ్రయించగా, వారు వెంటనే చర్యలు చేపట్టి బస్టాండ్ పరిసరాల్లో గాలింపు నిర్వహించి, గంటలోపే 48 గ్రాముల బంగారు నెక్లెస్‌ను గుర్తించారు. అనంతరం బాధితురాలిని పిలిపించి ధృవీకరించి ఆమెకు నెక్లెస్‌ను అప్పగించారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్కును సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
*Avja ఎన్టీఆర్ జిల్లా మూలపాడు*    *ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం లోని సీతాకోక...
By Rajini Kumari 2026-05-29 11:23:47 0 68
SURAKSHA
Community Policing Builds Trust Between Karnataka Police and Public
Karnataka Police follows community policing to build public trust. Monthly ‘Police Meet...
By Kalaga Sailaja 2026-07-01 11:53:37 0 129
Andhra Pradesh
కలెక్టరేట్లో నేడు కవయిత్రి ఆతుకూరి జయంతి
కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ...
By Boiena Rajesh 2026-03-13 04:50:53 0 228
Telangana
*జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..*
*రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..* *టీయూడబ్ల్యూజే (హెచ్-143) సభ్యత్వ...
By Thirupathi Konda 2026-07-15 09:34:43 0 45
Delhi - NCR
Delhi-NCR Infrastructure Projects Drive Urban Growth
Delhi-NCR continues to witness major infrastructure development projects that are reshaping the...
By Fathima Safa 2026-06-25 11:53:21 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com