షాబాద్ కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ మృతి.|

6
897

"పంజర్లలో మృతదేహం లభ్యం.. పక్కనే పాయిజన్ బాటిల్ స్వాధీనం"

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, జులై 13: షాబాద్‌లో సంచలనం సృష్టించిన పోక్సో, ఆరు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు. 

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తూరు మండలం పంజర్ల గ్రామ సమీపంలోని ఓ వెంచర్‌లో సోమవారం అతని మృతదేహం లభ్యమైంది.

మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం సమీపంలో పాయిజన్ బాటిల్ లభ్యమవడంతో, ప్రాథమికంగా విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రాజ్‌కుమార్ మేనమామ స్వగ్రామం పంజర్లగా స్థానికులు చెబుతున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

#Sidhumaroju

Angry
1
Search
Categories
Read More
Business & Finance
Goa MSME Sector Receives Fresh Growth Support
Goa's micro, small, and medium enterprises (MSMEs) are benefiting from improved access to...
By Navya Sree 2026-07-06 07:55:26 0 111
Entertainment
India enter T20 world Cup final
టీ20 వరల్డ్‌ కప్‌: ఫైనల్‌లోకి భారత్‌ 🏏🇮🇳 టీ20 వరల్డ్‌ కప్‌ రెండో...
By G k Nookala 2026-03-05 17:40:08 0 128
Andhra Pradesh
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్ని కోటేశ్వరరావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గత కొన్ని రోజులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్ని కోటేశ్వరావు గారు అనారోగ్యంతో...
By Rajini Kumari 2026-01-25 11:08:53 0 191
Andhra Pradesh
భార్యా మరో యువకునితో లేచిపోయిందని కాలు నరుక్కున్న యువకుడు.
భార్య మరొకరితో వెళ్లిపోయిందన్న మనస్తాపంతో శ్రీరాములు (35) అనే వ్యక్తి తన కాలును కొడవలితో...
By Pagadala Venkateswar 2026-04-06 04:18:26 0 155
SURAKSHA
K. Biju, IAS: Leading Kerala with Vision and Integrity
The Journey Begins "True leadership in public administration is measured by the positive...
By Fathima Safa 2026-07-15 14:00:57 0 64
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com