(SIR)ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత అవసరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
141

ఆసిఫాబాద్, జూలై 11 : భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఆసిఫాబాద్ పట్టణంలోని ఓడపల్లి గార్డెన్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి లోక్‌సభ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు సరైన అవగాహన ఉండటం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల జాబితా ప్రతి అర్హుడైన ఓటరిని ప్రతిబింబించేలా ఉండాలంటే ఎన్నికల సంఘం చేపట్టే ప్రతి ప్రక్రియపై ప్రజలు అవగాహన కలిగి ఉండటంతో పాటు బాధ్యతాయుతంగా సహకరించాలని ఆయన కోరారు,ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటరు నమోదు, వివరాల ధృవీకరణ, అవసరమైన సవరణలు, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశాలు వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు,

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధ హక్కు అని పేర్కొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకోవడంతో పాటు ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని సూచించారు,ఆ కార్యక్రమంలో ప్రజలు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అవసరం: జేసీ.
మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది....
By Pagadala Venkateswar 2026-03-31 03:34:26 0 146
Telangana
సిరోల్ మండల కేంద్ర శివారులో రోడ్డు ప్రమాదం.
మహబూబాబాద్ జిల్లా: స్కూటీ, బైక్ డీ.. ఆరుగురుకి తీవ్ర గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం.....
By Bheeshman King 2026-04-10 11:27:28 0 210
Andhra Pradesh
"సుపరిపాలన దినోత్సవం" సందర్భంగా నిర్వహించిన బహిరంగసభ బందోబస్తు స్వయంగా పర్యవేక్షించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.
*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 25.12.2025* _*// “సుపరిపాలన దినోత్సవం” సందర్భంగా...
By KOTESWARARAO KVSR 2025-12-25 12:21:38 0 254
Telangana
గణనాథులను దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:   వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్...
By Sidhu Maroju 2025-09-01 13:36:51 0 428
SADHANA
Educational system
తెలంగాణ విద్యా కమిషన్ అందించిన నివేదికలో చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు, వచ్చే విద్యా సంవత్సరం...
By G k Nookala 2026-02-26 16:55:13 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com