Nitin Gadkari: ఏపీకి శుభవార్త చెప్పిన నితిన్ గడ్కరీ.

0
150

Andhra

 

Gadkari good news for Andhra Pradesh

మచిలీపట్నం పోర్టుకు రూ. 573.77 కోట్లతో కొత్త రోడ్డు

6-లేన్ల ఎక్స్‌టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్డుకు కేంద్రం ఆమోదం

జాతీయ రహదారుల నుంచి పోర్టుకు నేరుగా అనుసంధానం

ఈ ప్రాజెక్టులో 3 ఫ్లైఓవర్లు, ఒక రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం

రవాణా సమయం తగ్గి, లాజిస్టిక్స్ సామర్థ్యం పెరుగుతుందని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం పోర్టు అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పోర్టుకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు రూ. 573.77 కోట్ల వ్యయంతో 6-లేన్ల ఎక్స్‌టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు.

 

ఈ ప్రాజెక్టులో భాగంగా, జాతీయ రహదారి-216లోని మచిలీపట్నం బైపాస్ సెక్షన్ మీదుగా జాతీయ రహదారి-65, జాతీయ రహదారి-216 కూడలి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఈ 6-లేన్ల రహదారిని నిర్మించనున్నారు. దీనివల్ల జాతీయ రహదారుల కారిడార్ నుంచి పోర్టుకు నేరుగా, వేగవంతమైన రవాణా సౌకర్యం కలుగుతుందని గడ్కరీ తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో సరుకు రవాణా వాహనాల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.

 

ఆమోదం పొందిన ప్రాజెక్టులో 6-లేన్ల ప్రధాన రహదారితో పాటు సర్వీస్ రోడ్లు, 3 ఫ్లైఓవర్లు, ఒక ఓవర్‌పాస్ కమ్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ROB) నిర్మాణం కూడా ఉన్నట్లు కేంద్రమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నం పోర్టు లాజిస్టిక్స్ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అమ్మచెరువుమిట్టలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్ శిబిరం.
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం బొమ్మనచెరువు వైద్య...
By Pagadala Venkateswar 2026-06-20 04:23:44 0 64
Andhra Pradesh
డిల్లీ కి డోమ్... శత్రువుల గుండెల్లో రైళ్లు...
డిల్లీ రక్షణ కోసం కేంద్రం క్యాపిటల్ డోమ్ పేరు తో రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది. శత్రువుల...
By Karapati Gopi 2025-12-28 03:25:49 0 396
Andhra Pradesh
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్.
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి...
By Pagadala Venkateswar 2026-03-16 10:15:02 0 176
Telangana
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీ
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఇ....
By Prashanth Goindla 2026-01-21 19:24:42 0 437
Andhra Pradesh
*రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశాన్ని జయప్రదం చేయాలి.... రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
ఈనెల 19 వ తేదీన బాపట్ల పట్టణంలోని శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-04-17 08:30:08 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com