జులై 19న కోస్గిగి లో వాల్మీకుల సదస్సు
వాల్మీకుల ఎస్టీ హక్కుల సాధన లక్ష్యంగా ఈ నెల 19న కోసిగి పట్టణంలో నిర్వహించనున్న వాల్మీకి చైతన్య సదస్సును విజయవంతం చేయాలని వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీ రామ్ భీం నాయుడు పిలుపునిచ్చారు.
శుక్రవారం కోసిగిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు, మంత్రాలయం మండలాలకు చెందిన వాల్మీకి కుటుంబాలు పెద్ద ఎత్తున ఈ సదస్సుకు హాజరుకావాలని కోరారు. ఈ సదస్సు వాల్మీకుల సామాజిక, విద్యా, ఆర్థిక అభ్యున్నతికి దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తుందని తెలిపారు.
దశాబ్దాలుగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉద్యమాలు, వినతులు, నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆశించిన ఫలితాలు సాధ్యం కాలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో వాల్మీకుల డిమాండ్కు అనుకూల వాతావరణం నెలకొన్నదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి, వాల్మీకులకు ఎస్టీ హోదా కల్పించేందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది వాల్మీకులు ఉన్నారని, వారికి ఎస్టీ హోదా కల్పించబడితే విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి రంగాల్లో విశేష అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ దిశగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటే వాల్మీకుల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుందని అన్నారు.
వాల్మీకుల భవిష్యత్తు తరాల అభ్యున్నతి కోసం నిర్వహిస్తున్న ఈ చైతన్య సదస్సుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి వాల్మీకి కుటుంబం భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో వాల్మీకి సంఘం నాయకులు జ్ఞానేశ్, హనుమంతు, నాగేష్, దిద్ది నాగేష్, హనుమన్న, వెంకటేష్, బసవరాజు, వెంకటరాముడు, గోపాల్, గాదిరెడ్డి, అనుమప్ప తదితరులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz