జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 

0
60

జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 

పార్టీ శ్రేణులు, ప్రజలతో మరింతగా మమేకం కావాలి 

క్షేత్ర స్థాయిలో జనసేన కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేయాలి 

విజయవాడలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం 

జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గురువారం రాత్రి విజయవాడలో నిర్వహించిన పార్టీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా ముందుకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో ప్రజలతో... అదే సమయంలో జనసేన శ్రేణులతో మరింతగా మమేకం కావడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. 

పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో బలంగా నిలబడ్డ ప్రతి వీర మహిళకి, జన సైనికుడికి అండగా నిలవాలి. వారి సాధక బాధకాలు తెలుసుకొని భరోసా ఇవ్వాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే కార్యక్రమాల నిర్వహణ షెడ్యూల్ ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అనుసరించాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను ఎప్పటికప్పుడు తెలియచేయాలి” అన్నారు. ఈ సందర్భంగా జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణకు పార్లమెంట్ నియోజక వర్గాలకు పరిశీలకులుగా వెళ్ళిన ప్రజా ప్రతినిధులు తమ అనుభవాలను వివరించారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న పార్లమెంట్ నియోజక వర్గాల పరిశీలకులు, కమిటీ సభ్యులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎంపీలు శ్రీ వి.బాలశౌరి గారు, శ్రీ టి ఉదయ్ శ్రీనివాస్ గారు, శ్రీ లింగమనేని రమేష్ గారు, ఎమ్మెల్సీలు శ్రీ నాగబాబు గారు, శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
కేబుల్ మెడకు తగిలి ప్రధాన ఉపాధ్యాయుడు మృతి చీరాల మండలంలో విషాద ఘటన
చీరాల: చీరాల మండలం పరిధిలోని దేవి నూతల గవినివారి పాలెం రహదారిపై మంగళవారం ఉదయం ఓ విషాదకర ప్రమాదం...
By Gadiyapudi Narendra 2026-02-11 16:25:12 0 190
SURAKSHA
Wednesday Hero UP Police: Blood Donors Saving Lives
This Wednesday UP police officers led blood donation camps in 15 districts. “Rakt Daan...
By Kalaga Sailaja 2026-07-04 09:51:39 0 45
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ నగరం లో డివైడర్ల లో ఎండిపోయిన చెట్లకు నీరు పోసిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-06-02 12:56:34 0 116
Andhra Pradesh
కలెక్టరేట్ ఆవరణంలో సీపీఐ ధర్నా
    రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సీపీఐ నిర్వహించిన ధర్నాలో భాగంగా ఈరోజు విశాఖపట్నం...
By Mobbu Venkatramana 2026-02-14 07:29:29 0 315
Telangana
కరీంనగర్ : ఆర్టీసీలో ఒకేరోజు 400 మంది రిక్రూట్మెంట్...!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ పరిధిలో వివిధ విభాగాలకు చెందిన 42 మంది ఉద్యోగులు....
By Sunka Santhosh 2026-07-01 19:07:31 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com