నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌.. రైతులకు భూ హక్కుల పండుగ.

0
58

 

 

'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ

22-ఏ నిషేధిత జాబితా నుంచి 2074 ఎకరాలకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు

చుక్కల భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపుతున్న ప్రజా ప్రభుత్వం

దశాబ్దాలుగా నలుగుతున్న రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు ప్రజా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రైతుల భూములకు సంపూర్ణ హక్కులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించ‌నున్నారు. ఈ పర్యటన ద్వారా వేలాది ఎకరాల భూములకు నిషేధిత జాబితాల నుంచి విముక్తి కల్పించి, రైతులకు శాశ్వత హక్కు పత్రాలను అందజేయనున్నారు.

 

ఈ పర్యటనలో భాగంగా బేతంచర్ల మండలం గుటుపల్లి గ్రామానికి చెందిన 897 మంది రైతులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. దశాబ్దాలుగా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న 2074 ఎకరాల భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు తన సమక్షంలోనే ఈ భూములను నిషేధిత జాబితా నుంచి ఆన్‌లైన్‌లో తొలగించి, సంబంధిత రైతులకు హక్కు పత్రాలను స్వయంగా అందజేయనున్నారు. తమ సొంత భూమిపై అమ్ముకునే హక్కు గానీ, రుణాలు పొందే అవకాశం గానీ లేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు ఇది చరిత్రాత్మక క్షణంగా నిలవనుంది.

Search
Categories
Read More
Telangana
సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధం
మేడారంలో తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు   తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడా...
By Pinnehasan Odela 2026-01-14 18:09:55 0 189
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న పాఠశాలల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎయిడెడ్,...
By John Baji 2026-01-21 11:15:32 0 233
Andhra Pradesh
నిమ్మనపల్లి: ట్రాక్టర్ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
గురువారం నిమ్మనపల్లి మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో ముస్తూరుకు చెందిన రైతు మస్తాన్ తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-26 03:15:16 0 73
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
సోమల మండలం, నంజమ్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లింగ వివక్షతపై మండల...
By Kothuru Murali 2026-02-23 12:26:19 0 365
Andhra Pradesh
ఉపాధి పనుల్లో విజయనగరం స్టేట్ ఫస్ట్
జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. జలధార-జలహారతి, ఫిష్ పాండ్ త్రవ్వకాలతో రోజుకు...
By Boiena Rajesh 2026-05-21 14:18:10 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com