నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌.. రైతులకు భూ హక్కుల పండుగ.

0
57

 

 

'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ

22-ఏ నిషేధిత జాబితా నుంచి 2074 ఎకరాలకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు

చుక్కల భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపుతున్న ప్రజా ప్రభుత్వం

దశాబ్దాలుగా నలుగుతున్న రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు ప్రజా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రైతుల భూములకు సంపూర్ణ హక్కులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించ‌నున్నారు. ఈ పర్యటన ద్వారా వేలాది ఎకరాల భూములకు నిషేధిత జాబితాల నుంచి విముక్తి కల్పించి, రైతులకు శాశ్వత హక్కు పత్రాలను అందజేయనున్నారు.

 

ఈ పర్యటనలో భాగంగా బేతంచర్ల మండలం గుటుపల్లి గ్రామానికి చెందిన 897 మంది రైతులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. దశాబ్దాలుగా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న 2074 ఎకరాల భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు తన సమక్షంలోనే ఈ భూములను నిషేధిత జాబితా నుంచి ఆన్‌లైన్‌లో తొలగించి, సంబంధిత రైతులకు హక్కు పత్రాలను స్వయంగా అందజేయనున్నారు. తమ సొంత భూమిపై అమ్ముకునే హక్కు గానీ, రుణాలు పొందే అవకాశం గానీ లేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు ఇది చరిత్రాత్మక క్షణంగా నిలవనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల ప్రధాన మసీదు సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ – తక్షణ చర్యలు అవసరం
చీరాల: చీరాల పట్టణంలోని ప్రధాన మసీదు సెంటర్ వద్ద ఉన్న మురుగునీటి డ్రైనేజీ ప్రధాన మార్గం ప్రస్తుతం...
By Gadiyapudi Narendra 2026-02-18 16:22:16 0 193
Andhra Pradesh
మదనపల్లి: దంపతులపై దాడి కేసు నమోదు.
మదనపల్లె మండలంలోని పొన్నేటిపాళ్యం పంచాయతీ పరిధి పనసమాకులపల్లిలో ఆవు చేనులో మేసిందనే కారణంతో...
By Pagadala Venkateswar 2026-02-21 11:09:45 0 168
Telangana
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీ పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-01-02 09:44:43 0 209
Andhra Pradesh
జనసేన నాయకుల విందు: పార్టీ బలోపేతంపై చర్చ.
ఆదివారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జనసేన నాయకులు విందులో పాల్గొన్నారు. కదిరి నియోజకవర్గం...
By Pagadala Venkateswar 2026-04-20 03:31:48 0 108
Telangana
జనసేవకుడు పెద్దపురం నరసింహకు డాక్టరేట్ పురస్కారం.
గత 15 సంవత్సరాలుగా పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వాళ్ల వరకు నిరంతరం సేవ చేస్తూ.. ముందు వరసలో...
By Sidhu Maroju 2025-06-16 18:12:46 2 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com