మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం

0
1K

*_ఒకే కుటుంబానికి చెందిన 9మంది దుర్మరణం_* *_మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో ఝబువా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ సమీపంలో ముందు నుంచి వస్తున్న వ్యాన్​ను లారీ ఢీకొట్టింది._* *_ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు._* *_బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, వీరంతా వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది._* *_మేఘ్​నగర్ తహసీల్​ ప్రాంతంలోని సంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలోని తాత్కాలిక రహదారి నిర్మాణం జరుగుతుంది._* *_ఈ క్రమంలో ఓవర్​- బ్రిడ్జ్​ని సిమెంట్ లోడ్​తో ఉన్న లారీ దాటుతుండగా అదుపు తప్పి ప్యాసింజర్స్​ ఉన్న వ్యాన్​పై బోల్తా పడిందని ఝబువా సూపరిటెండెంట్​ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు._* *_ఈ ప్రమాదంలో 9మంది మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. దీంతో వ్యాన్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు._* *_మృతుల్లో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. చనిపోయిన వారిలో ముఖేష్ (40), సావ్లి (35), వినోద్ (16), పాయల్ (12), మధి (38), విజయ్ (14), కాంత (14 ), రాగిణి (9), అకాలి (35), పాయల్ సోమ్లా పర్మార్ (19 ), అషు (5 ) ఉన్నారు._* *_ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వారితో పాటు మృత దేహాలను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు._*

Search
Categories
Read More
Telangana
ఐజి స్థాచ్ వద్ధ మాన్ హోల్ నుండి రోజుల తరబడి రోడ్డుపై పారుతున్న మురికినీరు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఐజి స్టాచ్ వద్ద మ్యాన్ హోల్ నుండి రోడ్డు పైకి రోజుల తరబడిగా పారుతున్న...
By Sidhu Maroju 2025-06-27 09:34:05 0 1K
BMA
📰 Fact vs. Fake: How Journalists Can Fight Misinformation in the Digital Age
📰 Fact vs. Fake: How Journalists Can Fight Misinformation in the Digital Age In today’s...
By BMA (Bharat Media Association) 2025-05-28 06:20:42 0 2K
Bharat Aawaz
అక్షరానికా? లేక అధికారానికా?
ఒక జర్నలిస్టుగా మీ ప్రాథమిక విధి, సమాజంలోని లోపాలను, అవినీతిని, అన్యాయాన్ని ఎత్తిచూపడమే. ఏళ్ల...
By Bharat Aawaz 2025-07-08 17:56:35 0 769
Bharat Aawaz
గళం మీది. వేదిక మనది.
గళం మీది. వేదిక మనది. తీరం ఒడ్డున నిలబడితే మార్పు రాదు. ప్రవాహంలో భాగమైనప్పుడే చరిత్ర...
By Bharat Aawaz 2025-07-08 18:40:45 0 902
Karnataka
తుంగభద్ర డ్యాం సమస్యలు: నీటి నష్టం, సిల్టేషన్, మరియు పరిష్కారాల ఆలస్యం
సమస్య: తుంగభద్ర డ్యాం క్రెస్ట్ గేట్ దెబ్బతినడంతో భారీగా నీరు వృథా అవుతోంది.సామర్థ్యం తగ్గింపు:...
By Triveni Yarragadda 2025-08-11 06:20:45 0 468
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com