మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం

0
2K

*_ఒకే కుటుంబానికి చెందిన 9మంది దుర్మరణం_* *_మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో ఝబువా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ సమీపంలో ముందు నుంచి వస్తున్న వ్యాన్​ను లారీ ఢీకొట్టింది._* *_ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు._* *_బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, వీరంతా వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది._* *_మేఘ్​నగర్ తహసీల్​ ప్రాంతంలోని సంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలోని తాత్కాలిక రహదారి నిర్మాణం జరుగుతుంది._* *_ఈ క్రమంలో ఓవర్​- బ్రిడ్జ్​ని సిమెంట్ లోడ్​తో ఉన్న లారీ దాటుతుండగా అదుపు తప్పి ప్యాసింజర్స్​ ఉన్న వ్యాన్​పై బోల్తా పడిందని ఝబువా సూపరిటెండెంట్​ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు._* *_ఈ ప్రమాదంలో 9మంది మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. దీంతో వ్యాన్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు._* *_మృతుల్లో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. చనిపోయిన వారిలో ముఖేష్ (40), సావ్లి (35), వినోద్ (16), పాయల్ (12), మధి (38), విజయ్ (14), కాంత (14 ), రాగిణి (9), అకాలి (35), పాయల్ సోమ్లా పర్మార్ (19 ), అషు (5 ) ఉన్నారు._* *_ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వారితో పాటు మృత దేహాలను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు._*

Search
Categories
Read More
Telangana
*కొల్‌కతాలో ఉద్రిక్తత.. మెస్సి ఈవెంట్‌ ఆర్గనైజర్‌ అరెస్టు*
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి కోల్‌కతా టూర్‌ సందర్భంగా...
By SivaNagendra Annapareddy 2025-12-13 13:38:31 0 296
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం :కల్లూరులో కాంట్రాక్ట్ టీచర్ అసభ్య ప్రవర్తన!
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా...
By Kothuru Murali 2026-02-25 11:16:49 0 87
Telangana
నిజామాబాద్ : డ్రoకెన్ డ్రైవ్ లో3.90 జరిమాన
నిజామాబాద్ డ్రoకెన్ డ్రైవ్ లో పట్టుబడినా ఈధరికి ఒకోకారికి వారంరోజుల చోపున జైలు శిక్ష విధిస్తు...
By Sadaq Sadaq 2026-03-03 00:07:20 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com