మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం

0
2K

*_ఒకే కుటుంబానికి చెందిన 9మంది దుర్మరణం_* *_మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో ఝబువా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ సమీపంలో ముందు నుంచి వస్తున్న వ్యాన్​ను లారీ ఢీకొట్టింది._* *_ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు._* *_బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, వీరంతా వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది._* *_మేఘ్​నగర్ తహసీల్​ ప్రాంతంలోని సంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలోని తాత్కాలిక రహదారి నిర్మాణం జరుగుతుంది._* *_ఈ క్రమంలో ఓవర్​- బ్రిడ్జ్​ని సిమెంట్ లోడ్​తో ఉన్న లారీ దాటుతుండగా అదుపు తప్పి ప్యాసింజర్స్​ ఉన్న వ్యాన్​పై బోల్తా పడిందని ఝబువా సూపరిటెండెంట్​ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు._* *_ఈ ప్రమాదంలో 9మంది మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. దీంతో వ్యాన్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు._* *_మృతుల్లో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. చనిపోయిన వారిలో ముఖేష్ (40), సావ్లి (35), వినోద్ (16), పాయల్ (12), మధి (38), విజయ్ (14), కాంత (14 ), రాగిణి (9), అకాలి (35), పాయల్ సోమ్లా పర్మార్ (19 ), అషు (5 ) ఉన్నారు._* *_ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వారితో పాటు మృత దేహాలను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు._*

Search
Categories
Read More
Telangana
యువత సన్మార్గంలో పయనించాలి
జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్...
By Thativar Shivaji 2026-02-14 10:50:03 0 172
Nagaland
Nagaland Handloom Exhibition Showcases Local Artisans in Kohima
The #Nagaland Handloom & Handicrafts Development Corporation is organizing a vibrant...
By Pooja Patil 2025-09-13 07:36:40 0 160
Andhra Pradesh
పుంగనూరు:సుగుటూరు గంగమ్మ వీడియో వైరల్
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి...
By Kothuru Murali 2026-02-22 09:52:50 0 89
Telangana
బోనాల చెక్కుల పంపిణి
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి కి ప్రతీక అయిన బోనాల పండుగ కు రాష్ట్రంలో ఎటువంటి ఆదాయం లేని...
By Sidhu Maroju 2025-07-09 17:25:37 0 1K
Andhra Pradesh
మదనపల్లి ఆసుపత్రిలో మందుల కొరత తీర్చాలి: బహుజన యువసేన డిమాండ్.
మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర మందుల కొరతను వెంటనే నివారించాలని బహుజన యువసేన రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-03-11 03:13:37 0 95
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com