తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
2K

*ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం..మర్రి రాజశేఖర్ రెడ్డి* తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజ్గిరి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి సర్కిల్ బి ఆర్ యస్ నాయకులు జెఎసి వెంకన్న ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను కార్పొరేటర్ , మాజీ కార్పొరేటర్లు, తెలంగాణ ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. మల్కాజ్గిరి చౌరస్తా గాంధీ పార్కు లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను స్మరించుకుంటూ, భారీ ఎత్తున రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్త దానం చేశారు, ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు, యువకులతో సంతోషంగా గడిపి వారితో కలిసి రక్తదాన శిబిరం,అన్నదాన కార్యక్రమలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఎన్నో అవమానాలను వివక్షలను ఎదుర్కొని తెలంగాణ సాధన కోసం కష్టనష్టాలను ఎదుర్కొని ఆత్మ బలిదానాలు ఇచ్చిన సందర్భాలను గుర్తుకు చేసుకోవాలని అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ సాధించడానికి సారధిగా వ్యవహరించి ఆత్మ బలిదానానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన తర్వాత అత్యంత తక్కువ కాలంలోనే దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టారని అన్నారు. బంగారు తెలంగాణ కు శ్రీకారం చుట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ని గుర్తు చేసుకోవాలని మల్కాజ్గిరి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ మాజీ కార్పొరేటర్, జగదీష్ గౌడ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి , రావుల అంజయ్య, జీకే హనుమంతరావు, చిన్న యాదవ్, బాబురావు ,కాటమరాజు, ఉపేందర్ సతీష్, నర్సింగరావు, శివకుమార్, హేమంత్ పటేల్, గోపాల్, ఉస్మాన్, భాగ్యనంద్, దినేష్, సంతోష్, మారుతి ప్రసాద్, హేమంత్ రెడ్డి, బాలకృష్ణ, ఫరీద్, అరుణ్ రావు, పేపర్ శీను, గోపాల్, శేఖర్ గౌడ్, కృష్ణమూర్తి, శ్రీనివాస్ రెడ్డి, నవీన్ యాదవ్, సుమన్ గౌడ్, సాయి గౌడ్, వంశీ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి, వినీత్ సందీప్ నిఖిల్ రెడ్డి, జనార్ధన్, మురళి,,అధిక సంఖ్యలో యువకులు మహిళలు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
మిర్చి రైతులకు అండగా నిలవాలి.
మిర్చి యార్డుకు వచ్చే రైతులకు అండగా నిలుస్తూ, భరోసా కల్పించడమే లక్ష్యం కావాలని మిర్చి యార్డు వైస్...
By John Baji 2026-02-05 08:47:12 0 300
Andhra Pradesh
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు ....
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి...
By SivaNagendra Annapareddy 2025-12-15 15:01:08 0 234
Andhra Pradesh
పన్నులు సకాలంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ
పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% వడ్డీ రాయితీ వస్తుందని కమిషనర్ ఎల్.రామలక్ష్మి...
By Boiena Rajesh 2026-03-21 11:54:00 0 173
Andhra Pradesh
లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికి పోలీస్ అధికారి
పోలవరం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ లో వరుసగా అవినీతికి పాల్పడుతూ ఏసీబీ కి పట్టుబడుతున్న...
By Shyamala Yadagiri 2026-03-18 04:08:11 0 224
Bharat Aawaz
గళం మీది. వేదిక మనది.
తీరం ఒడ్డున నిలబడితే మార్పు రాదు. ప్రవాహంలో భాగమైనప్పుడే చరిత్ర లిఖించబడుతుంది. మీదొక కథ అయినా,...
By Bharat Aawaz 2025-07-08 18:37:46 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com