జర్నలిస్టుల సంక్షేమమే టీజేయు లక్ష్యం - రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు

0
2K

కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీజేయు కార్యాలయం ప్రారంభం..

హాజరైన పలువురు నేతలు... అభినందన వెల్లువలు

 

ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసమే తెలంగాణ జర్నలిస్టు యూనియన్ పాటు పడుతుందని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కప్పర ప్రసాద్  పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం యూనియన్ కార్యాలయాన్ని ఆయన గాజుల రామారావు డివిజన్ పరిధిలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కప్పర ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి తలొంచి జర్నలిస్టుల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కార్యాలయానికి అతిధులుగా విచ్చేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్ ఏర్పడ్డ కొద్ది రోజుల్లోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కార్యాలయం సందర్శించి నూతన కార్యవర్గాన్ని అభినందించారు.

Search
Categories
Read More
Telangana
బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపు కోరుతూ జోరుగా ఎన్నికల ప్రచారం.|
హైదరాబాద్:  జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరి కాలనీ లో...
By Sidhu Maroju 2025-11-01 18:49:58 0 229
Telangana
నూతన ITDA PO గా లెనిన్
ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి (పీఓ) గా Lenin Vatsal Toppo నియామకం
By Bittu Bittu 2026-04-26 00:47:30 0 427
Andhra Pradesh
గంగమ్మ జాతర లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: DSP.
సిటిఎం గంగమ్మ జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సోమవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-03 06:20:09 0 102
Andhra Pradesh
ప్లాస్టిక్ కవర్స్ వాడటాన్ని ప్రతి ఒక్కరు మానేయాలి : కమిషనర్
కర్నూలు సిటీ :  ప్లాస్టిక్‌ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలి• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-20 12:19:39 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com