ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

0
169

*ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి* 

 

 *సమ్మె జయప్రదం కొరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన గుంటూరుజిల్లా జీపు జాత శుక్రవారం నాడు రాజధాని లోని ఎర్రబాలెం వచ్చిన సందర్భంగా స్వాగతం పలుకుతున్న సిఐటియు నేతలు, మున్సిపల్ కార్మికులు*

*

*రాజధాని లోని ఎర్రబాలెంలో మాట్లాడుతున్న* *సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి* 

*జి. రమణ*

 

*లేబర్ కోడులను రద్దు చేయాలి*

 

*సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి* 

*జి.రమణ డిమాండ్* 

*

ఈ సందర్భంగా సిఐటియు రాజధాని డివిజన్ నాయకులు ఎం రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి జి. రమణ మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు 

 

స్వతంత్రం వచ్చిన నాటినుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తొలగించి వాటి స్థానంలో కార్పొరేట్లకు వత్తాసుగా నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చిందని 

ఇవి అమలు జరిగితే కార్మికులు కట్టు బానిసలుగా మారతారని సాధించుకున్న హక్కులన్నీ కోల్పోతారని అన్నారు 

 

కార్మిక వర్గానికి ఉరి తాళ్లుగా మారే లేబర్ కోడులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తక్షణం ఉపసంహరించు

కోవాలని రమణ డిమాండ్ చేశారు 

 

కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు 

 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పని గంటల పెంపు, మహిళలతో రాత్రిపూట డ్యూటీలు చేపించాలనె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు 

 

కార్మిక వ్యతిరేక విధానాలను పాలకులు విడనాడకపోతే కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని రమణ హెచ్చరించారు 

 

ఏఐటి యుసి గుంటూరు జిల్లా అధ్యక్షులు

 ఏ అరుణ్ కుమార్ మాట్లాడుతూ 

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు 

 

ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు

 

ఈ కార్యక్రమంలో సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు 

బి లక్ష్మణరావు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాజధాని ప్రాంత నాయకులు ఆదిలక్ష్మి ఎం పార్వతి చిన్న శ్రీను కొండలు శ్రీలక్ష్మి రమాదేవి ఎస్కే సుభాని గాంధీ కోటేశ్వరరావు తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.  ...
By Gadiyapudi Narendra 2026-01-10 16:40:05 0 262
Telangana
హనుమకొండ: పెన్షన్ ఇపించండి సారు....!
2019లో సుమారు 6 నెలలు తనకు పింఛన్ వచ్చిందని ఆ తర్వాత ఏడేళ్ల అవుతున్న       ...
By Prashanth Goindla 2026-01-12 10:20:31 0 421
Andhra Pradesh
ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు.. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్!.
సెప్టెంబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక ఎన్నికల ఏర్పాట్లపై...
By Pagadala Venkateswar 2026-05-13 06:11:12 0 83
Andhra Pradesh
మారనున్న కుప్పం ఆర్టీసీ బస్టాండ్ రూపురేఖలు: రూ.75 కోట్లతో ఆధునీకరణ
కుప్పం ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపోను రూ.75 కోట్లతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ వైస్...
By Kothuru Murali 2026-04-15 07:16:34 0 123
Andhra Pradesh
ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ తో మంత్రి మండిపల్లి భేటీ
Press Release  సచివాలయం,అమరావతి  (10-07-2026).    *హింద్రీనివా సుజల...
By Benguluri Madhubabu 2026-07-10 13:56:36 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com