మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హెడ్మా అరెస్ట్

0
2K

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మరువక ముందే మరో కీలక నేతను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలోని జనగూడకు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బోయిపరిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని పెటగూడ గ్రామ సమీపంలోని అడవుల్లో హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిసర ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే చాలా మంది మావోయిస్టులు అక్కడ్నుంచి పారిపోయారు. మావోయిస్టు కుంజాం హిడ్మా మాత్రం అక్కడున్న చెట్ల పొదల్లో తలదాచుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హిడ్మా అని పోలీసుల విచారణలో తేలింది. కుంజాం హిడ్మా ప్రస్తుతం ఏరియా కమిటీ మెంబర్ కొనసాగుతున్నారు. హిడ్మా నుంచి ఏకే 47 రైఫిల్, 35 రౌండ్ల బుల్లెట్లు, 27 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్, 90 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 2 కేజీల గన్ పౌడర్, రెండు స్టీల్ కంటైనర్స్, రెండు రేడియోలు, ఒక ఇయర్ ఫోన్, వాకిటాకీ, బ్యాటరీ, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా డిఎస్బి వన్ నుంచి...
By Kothuru Murali 2026-01-12 08:27:14 0 103
Andhra Pradesh
ఇస్రో లో అప్రెంటిస్ ఉద్యోగాలు :
కర్నూలు : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్,...
By Hari Krishna 2025-12-23 04:39:47 0 143
Andhra Pradesh
PM సూర్య ఘర్ & పీఎం కుసుం కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర స్థాయి వీడియో...
By Pagadala Venkateswar 2026-02-21 04:32:47 0 97
Andhra Pradesh
అయ్యప్ప స్వామి వారిని పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి గారు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కోటమలై కొండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామిని గురువారం మాజీ...
By Kothuru Murali 2026-01-02 05:24:26 0 120
Andhra Pradesh
23వ తారీకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవిగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
ప్రకటన   విషయం: రేపు తేది 23.01.2026న శ్రీ పంచమి పురస్కరించుకుని శ్రీ కనక దుర్గ అమ్మవారు...
By Rajini Kumari 2026-01-22 12:27:23 0 143
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com