శ్రీనివాస లాడ్జిలో జూద స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి... 7 మంది పట్టివేత, రూ.18,500 నగదు స్వాధీనం చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

0
59

శ్రీనివాస లాడ్జిలో జూద స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి... 7 మంది పట్టివేత, రూ.18,500 నగదు స్వాధీనం చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ పామూరు ఆధ్వర్యంలో ప్రత్యేక దాడులు నిర్వహించారు.

ఈ క్రమంలో పామూరులోని శ్రీనివాస లాడ్జిలో కొందరు వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 7 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.18,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జూదం, బెట్టింగ్ మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
West Bengal
West Bengal Advances Urban Development and Smart Cities
West Bengal is accelerating urban development through Smart Cities Mission projects, improved...
By Fathima Safa 2026-07-02 05:22:10 0 40
Telangana
మానుకోట రైలు పట్టాలపై ఓ..ప్రాణం పోబోతుంది
సమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి...   కటికి చీకటి...
By Bheeshman King 2026-07-22 13:03:27 0 125
Business & Finance
Credit Score Repair Could Unlock Better Loan Deals
Credit score repair focuses on improving your credit profile by correcting errors, reducing...
By Navya Sree 2026-07-10 06:20:54 0 56
Sikkim
PMGSY-IV: Boosting Rural Road Connectivity in Sikkim
The Rural Development Department of Sikkim has officially invited bids for the ambitious...
By Lokeshwari Panthadi 2026-07-02 08:24:00 0 72
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు : దుంపల రంజిత్ కుమార్
* మంచిర్యాల జిల్లా * ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలి * ఆర్టీసీని...
By Avunoori Mahesh 2026-04-23 08:05:09 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com