ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి: బండి రమేష్

0
518

మియాపూర్, జూన్ 5 (న్యూస్ డెస్క్): తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు మియాపూర్‌లో పర్యటించనున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తెలిపారు. రూ.161 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవనానికి భూమిపూజతో పాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు.

శుక్రవారం మియాపూర్‌లో కార్యక్రమ స్థలాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించిన బండి రమేష్, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.

 

ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ , రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొలను హనుమంత రెడ్డి , శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జగదీశ్వర్ గౌడ్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలని బండి రమేష్ పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీవారి లడ్డు కల్తీ అసత్య ప్రచారంపై క్షమాపణ చెప్పాలని డిమాండ్
తిరుమల తిరుపతి శ్రీ వారి లడ్డు కల్తీ విషయంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారంపై తక్షణమే...
By Rajini Kumari 2026-02-27 10:25:50 0 139
Andhra Pradesh
భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.
  భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు   Andhra AP High Court key ruling...
By Pagadala Venkateswar 2026-06-10 05:44:25 0 59
Meghalaya
Global Military Drills in Umroi
The maiden edition of the multinational joint military exercise, PRAGATI 2026, has entered an...
By Dunna Jessicaruth 2026-05-25 06:47:10 0 66
Andhra Pradesh
Andhra Pradesh Rains: ఏపీకి వర్ష సూచన.. దక్షిణ కోస్తాలో వడగళ్ల వాన హెచ్చరిక!.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ...
By Pagadala Venkateswar 2026-03-20 09:43:15 0 194
Andhra Pradesh
సదుం పోలీస్ స్టేషన్ పరిశీలించిన డిఐజి కోయ ప్రవీణ్ణ్
ఆదివారం, పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుం పోలీస్ స్టేషన్‌ను కర్నూల్ డిఐజి కోయ ప్రవీణ్...
By Kothuru Murali 2026-01-04 10:51:27 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com