నిజామాబాద్: ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

0
125

నిజామాబాద్.ఎస్ఐఆర్ (Special Intensive Revision) సర్వేలో భాగంగా మొదటి రోజు సంబంధిత బీఎల్ఓల నుంచి ఎన్యూమరేషన్ పత్రాలను స్వీకరించడం జరిగిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ పత్రాన్ని పూర్తిగా, సరైన వివరాలతో నింపి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి, నిర్ణీత గడువులోగా సంబంధిత బీఎల్ఓ లేదా ఎన్నికల అధికారులకు అందజేయాలని కోరారు.ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, చిన్న నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో ఓటు నమోదు, సవరణ లేదా ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ప్రతి కుటుంబం ఈ ప్రక్రియను సీరియస్‌గా తీసుకుని, ఇంట్లోని ప్రతి అర్హత కలిగిన ఓటరికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయించాలని సూచించారు.నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలందరూ ఎన్నికల సంఘానికి సహకరిస్తూ ఈ సర్వేను విజయవంతం చేయాలని, అలాగే తమ బంధువులు, స్నేహితులు, పొరుగువారిలో కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించేలా సహకరించాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విజ్ఞప్తి చేశారు.

*"మన ఓటు – మన హక్కు... మన బాధ్యత. ప్రతి ఓటరిని రక్షించుకుందాం... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం."*

Search
Categories
Read More
SURAKSHA
Justice in Action: The Inspiring Journey of IPS Nilambari Vijay Jagdale
Breaking Barriers: How IGP Nilambari Jagdale Redefined Police Leadership "A uniform is not...
By Kalaga Sailaja 2026-07-22 11:08:40 0 43
SURAKSHA
Gandam Chandrudu, IAS: A Leader in Public Governance
A Visionary Civil Servant Advancing Inclusive Development, Administrative Excellence, and...
By Lokeshwari Panthadi 2026-07-13 06:27:57 0 97
Andhra Pradesh
టీటీడీలో కొలువులు... ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్ విడుదల.
టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ పద్ధతిలో...
By Pagadala Venkateswar 2026-04-25 05:02:15 0 96
Andhra Pradesh
44వ జాతీయ యోగి చాంపియన్ షిప్ 2025-2026 ప్రారంభోత్సవం
జిల్లేలమూడి శ్రీ వీళ్ళు జనని పరిషత్ అమ్మ వారి ప్రాంగణంలో ఘనంగా ప్రారంభీంచారు.ఈ కార్యక్రమం లో...
By Karapati Gopi 2025-12-27 12:21:16 0 709
Business & Finance
Rajasthan Industrial Park Policy Boosts Investment
Rajasthan is implementing its Industrial Park Promotion Policy 2026 to develop world-class...
By Navya Sree 2026-06-30 06:26:23 0 36
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com