చింతూరు ఏరియా ఆసుపత్రిలో ప్రసవ ఆపరేషన్లు నిలిచిపోయాయి: సీపీఐ(ఎం) ఆరోపణ!

0
129

చింతూరులోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత వారం రోజులుగా ప్రసవ సేవలు నిలిచిపోయాయని సీపీఐ(ఎం) నాయకులు పల్లపు వెంకట్, సీసం సురేష్ ఆరోపించారు. ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, సిజేరియన్ ప్రసవాలు పూర్తిగా ఆగిపోయాయని వారు తెలిపారు. గతంలో ఉన్న ఎం,వి, కోటిరెడ్డి  పదవి విరమణ చేయడంతో అనస్థీషియా డాక్టర్ లేక గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు. "ఈ ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, అవసరమైన సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం విఫలమైంది," అని వెంకట్ అన్నారు. "అనస్థీషియా డాక్టర్ లేకపోవడం వల్ల, గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు లేదా ఇతర నగరాలకు వెళ్లవలసి వస్తుంది, ఇది వారికి అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. "సురేష్ మాట్లాడుతూ, "చింతూరు మరియు పరిసర గ్రామాలకు ఈ ఆసుపత్రి కీలకమైనది. ఇక్కడ ప్రసవ సేవలు నిలిచిపోవడం వల్ల పేద మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు." అని తెలిపారు. "ప్రభుత్వం వెంటనే స్పందిించి అనస్థీషియా డాక్టర్ ను నియమించాలని, లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాము," అని వారు హెచ్చరించారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత...
By Chennaiah Kati 2026-07-14 10:52:33 0 48
Andhra Pradesh
చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు
చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు   బాపట్ల: బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-01-05 17:40:32 0 265
Jammu & Kashmir
CIK Strikes Transnational Terror Network: Synchronized Raids Across Six J&K Districts
The Counter Intelligence Kashmir (CIK) wing of the Jammu and Kashmir Police launched a major,...
By Tejaswini Komanduru 2026-06-05 06:29:22 0 77
Telangana
టాయిలెట్ నిర్మాణానికి రూపాయిలు 12000 ఇలా అప్లై చేసుకోండి..!
తెలంగాణ : స్వచ్ఛభారత్ మిషన్ -2 లో భాగంగా టాయిలెట్స్ లేని 2.19 లక్షల ఇళ్లకు వాటి నిర్మాణ కోసం...
By Sunka Santhosh 2026-04-10 07:10:46 0 213
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రి అధికారులపై చర్యలు.తీసుకోవాలి: బహుజన యువసేన
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని...
By Pagadala Venkateswar 2026-02-06 14:27:43 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com