అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్, ఎస్పీ

0
171
బాపట్ల జిల్లా: ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రవాణా చార్జీల మేరకే ఫీజులు వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనివార్య పరిస్థితుల్లో రోగులు మృతి చెందిన సందర్భాల్లో మృతదేహాన్ని గౌరవప్రదంగా తరలించే బాధ్యత సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్‌లదేనని స్పష్టం చేశారు. అంబులెన్స్ సేవల పేరుతో అదనపు రుసుములు వసూలు చేయడం లేదా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సహించబోమని హెచ్చరించారు.ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టికను అంబులెన్స్ యజమానులు స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.ఏవైనా ఫిర్యాదులు లేదా సమస్యలు ఉంటే కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ నంబర్ 1967 / 7702806804 ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ విజయమ్మ, డీసీహెచ్ డాక్టర్ పద్మావతి తదితర అధికారులు పాల్గొన్నారు.
అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు..
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్, ఎస్పీ హెచ్చరించారు. కచ్చితత్వం లేకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టపరమైన నేరమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై ఎలాంటి సమాచారం ప్రచారం చేసే ముందు సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన వివరణ తీసుకోవడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల్లో అపోహలు, గందరగోళం కలిగించే విధంగా పోస్టులు, సందేశాలు పంపితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
#Narendra
Search
Categories
Read More
Telangana
ప్రపంచాన్ని ఊరించే రుచి.. హైదరాబాద్ బిర్యానీ ఘనత.|
"వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా మరోసారి వెలుగులోకి వచ్చిన హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత" హైదరాబాద్,...
By Sidhu Maroju 2026-07-05 07:10:11 0 119
Andhra Pradesh
AP Land Prices: ఏపీలో ఆ భూములకు మార్కెట్ ధరలు పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు.
AP Land Prices Andhra Pradesh Hikes Land Values in Urban Areas ఏపీలో పట్టణ ప్రాంత భూముల విలువలు...
By Pagadala Venkateswar 2026-01-25 06:22:43 0 168
Andhra Pradesh
మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష...
By Chennaiah Kati 2026-03-10 11:02:11 0 446
Andhra Pradesh
పుంగనూరు: ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి
పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఫిబ్రవరి 12న...
By Kothuru Murali 2026-02-08 10:22:25 0 164
Andhra Pradesh
అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.
  అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం 18-04-2026 Sat 07:23 | Andhra...
By Pagadala Venkateswar 2026-04-18 04:15:17 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com