తపాలా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పథకం కింద నగదు ప్రోత్సాహం

0
343

నందిగామ ఎన్టీఆర్ జిల్లా

2025 సంవత్సరమునకు గాను తపాలా శాఖ వారు నిర్వహించినటువంటి దీన్ దయాల్ స్పర్శ యోజన స్కాలర్షిప్ పరీక్షలో నందిగామ కాకతీయ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని అందులో భాగంగా విజేతలైన విద్యార్థులకు 6000 క్యాష్ ప్రైస్ మరియు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని, ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ విజయవాడ డివిజన్ విజయవాడ శ్రీ ఎం నరసింహస్వామి తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించినటువంటి తపాలా స్కాలర్షిప్ పరీక్షలో 40 విజేతలకు గాను 6 గురు కాకతీయ స్కూల్ నుండి ప్రాతినిధ్యం వహించడం అభినందనీయమని విద్యార్థులకు మరియు కాకతీయ స్కూల్ యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ విధముగా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి తపాలా శాఖ స్కాలర్షిప్ పరీక్షల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగా విద్యార్థులు ఎక్కువ మొత్తంలో పాల్గొనాలని నరసింహ స్వామి పిలుపునిచ్చారు. మరియు జాతీయస్థాయిలో జరిగేటువంటి ఫిలాటిలిక్ ఎగ్జిబిషన్ లో భాగంగా పేరున్న ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు వారి యొక్క జాతీయ స్థాయి గుర్తింపు నిమిత్తం కార్పొరేట్ మరియు కామెమోరాటివ్ స్టాంప్స్ రిలీజ్ కు ముందుకు రావలసిందిగా  ఎం. నరసింహస్వామి  అభ్యర్థించారు. ఈ కార్యక్రమమునకు నందిగామ పోస్టల్ ఇన్స్పెక్టర్ లాహోరి విష్ణు, కాకతీయ స్కూల్ డైరెక్టర్ కార్తికేయ స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ సిబ్బంది మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
*పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...*   దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.లీటరు...
By Rajini Kumari 2026-05-15 11:48:32 0 120
Andhra Pradesh
స్మశాన వాటిక కబ్జాపై కలెక్టరేట్ ఎదుట నిరసన.
మదనపల్లె మండలం కొత్తపల్లి గ్రామంలోని సందిరెడ్డి పల్లె సమీపంలో ఉన్న స్మశాన వాటికను చంగల్ రాయుడు,...
By Pagadala Venkateswar 2026-06-08 15:50:53 0 66
Andhra Pradesh
బాపట్లలో SAAP లీగ్–2026 జిల్లా స్థాయి చెస్ పోటీలు
బాపట్ల జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ,జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (District Sports...
By Gadiyapudi Narendra 2026-02-17 16:12:04 0 193
Andhra Pradesh
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి గారు ప్రెస్ మీట్
వైయస్సార్సీపి ఇంచార్జ్ కృపా లక్ష్మి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలు ప్రజల్ని...
By Rajini Kumari 2026-06-09 12:41:09 0 226
Telangana
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థి...
By Sidhu Maroju 2025-11-14 14:00:33 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com