లక్సట్టిపేట్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
205

మంచిర్యాల : లక్షెట్టిపేట్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు,అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఆసుపత్రిలో పరిశుభ్రత, రోగులకు మెరుగైన సేవలు అందించే విషయంలో పలు సూచనలు చేశారు. ఆసుపత్రి పవిత్రతను కాపాడే ఉద్దేశ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సహా ఎవరైనా ఆసుపత్రి లోపలికి ప్రవేశించే సమయంలో చెప్పులు బయట విడిచి రావాలని వైద్యులకు సూచించారు,ఈ సందర్భంగా లక్షెట్టిపేట్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులపై కూడా ఎమ్మెల్యే గారు స్పందించారు. పట్టణ అభివృద్ధికి అత్యంత కీలకమైన రోడ్డు వెడల్పు పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని, ఎవరి అడ్డంకులు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు,ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట్ మున్సిపల్ కమిషనర్ విజయ్, MRO దిలీప్ , చైర్మన్ దొంత అంజలి - నర్సయ్య , మోత్కూరి రాజేశ్వరి- వెంకటస్వామి గౌడ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్ , కౌన్సిలర్ల, పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు చల్లా నాగభూషణం , పూర్ణచంద్రరావు , సర్పంచ్లు , ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నరు.

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలిలో ఈనెల 31న మెగా జాబ్ మేళా
బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి (SS) డిగ్రీ కాలేజీలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు...
By Boiena Rajesh 2026-03-29 04:15:42 0 218
Andhra Pradesh
ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి
*అటెండర్ ఇంట ‘సిరి’ సంపదలు..*   *ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!*...
By Rajini Kumari 2026-04-25 11:56:21 0 168
Andhra Pradesh
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం !!
కర్నూలు : బిజెపి నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ జబిన్ నియమితులయ్యారు. పార్టీ...
By Hari Krishna 2025-12-14 12:28:16 0 295
BMA
BJP Declares June 25 as 'Samvidhan Hatya Diwas'
Union Home Minister Amit Shah and PM Modi termed the 1975 Emergency a “dark chapter”...
By Bharat Aawaz 2025-06-25 11:40:55 0 2K
Andhra Pradesh
Train Fire Accident: అర్ధరాత్రి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ...
By Siva Bhaskar 2025-12-29 02:03:38 0 820
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com