ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.|

0
82

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: జిల్లాలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఐఏఎస్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. 

ఈ సందర్భంగా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పారదర్శకంగా కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని వారు కలెక్టర్‌ను కోరారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. 

జి.ఓ. ఎం.ఎస్. నెం.166 ప్రకారం సర్వే నెం.278లో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి తిరస్కరించబడిన దరఖాస్తులను పునఃపరిశీలించాలని, మల్కాజిగిరి నియోజకవర్గంలోని భూదాన్ భూముల్లో గృహ నిర్మాణ పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే రాజీవ్ రహదారి విస్తరణలో భాగంగా ప్రభావితమవుతున్న హిందూ దేవాలయాలను తగిన ప్రదేశాల్లో పునర్నిర్మించాలని, ఆల్వాల్ మీ సేవా కేంద్రం రోడ్డు విస్తరణలో కోల్పోతున్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో నూతన మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. 

తెలంగాణ తల్లి విగ్రహం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు, ఇటీవల వెంకటాపురం డివిజన్ టెలికాం కాలనీలో విద్యుత్ షాక్ కారణంగా మృతి చెందిన తండ్రి, కుమార్తె కుటుంబ సభ్యులకు తగిన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రాల్లో ప్రస్తావించిన అంశాలపై జిల్లా కలెక్టర్ మను చౌదరి సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
మల్కాజిగిరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమీక్ష
 మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :    మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-04 11:34:15 0 390
Telangana
నిజామాబాద్: పెట్రోల్ బంక్ లో బారులుతిరిన జానాo
నిజామాబాద్: పెట్రోల్ బంకులు బంద్  అనాడoథోప్రెట్రోల్ బంకులో బారులుతిరినజనం 
By Sadaq Sadaq 2026-03-24 18:25:03 0 162
Andhra Pradesh
పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో ఆదివారం ఒంటరి ఏనుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది....
By Kothuru Murali 2026-04-19 11:18:18 0 104
Andhra Pradesh
తిరుమలలో భక్తుల రద్దీ.. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు.
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 65,354 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 25,550 మంది యాత్రికులు...
By Pagadala Venkateswar 2026-04-23 03:42:31 0 101
Andhra Pradesh
మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత గద్దె రామ్మోహన్
*మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత* *డ్రగ్స్ పై దండయాత్ర ర్యాలీలో గద్దె రామమోహన్* ***...
By Rajini Kumari 2026-01-28 12:51:50 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com