యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు.

0
53

 

యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు

20-06-2026 Sat 15:15

Andhra

Chandrababu Naidu will work with Baba Ramdev to spread Yoga says CM at Undavalli Caves

ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రకటించిన సీఎం చంద్రబాబు

యోగా వ్యాప్తి కోసం బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి

హైదరాబాద్ ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు

టెక్నాలజీతో పాటు సంస్కృతి, ఆధ్యాత్మికత యువతకు ముఖ్యమని సూచన

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ యోగాను తీసుకెళ్లడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. యోగాను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి గుహల వద్ద శనివారం జరిగిన 'యోగాంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా హెల్తీ, వెల్తీ, హ్యాపీ, ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో తాను నిర్మించిన సైబరాబాద్ తరహాలోనే, ఇప్పుడు అమరావతిని 'హైదరాబాద్ ప్లస్'గా నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

 

"సైబరాబాద్ నిర్మాణం తర్వాత అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగైతే ప్రధాన ఆదాయ వనరుగా మారిందో, అదే స్థాయిలో అమరావతిని అభివృద్ధి చేస్తాం" అని అన్నారు.

 

టెక్నాలజీని అనుసంధానిస్తూనే, అమరావతిని ఒక నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని వివరించారు. యోగా అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి అని, దాని ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించి ఏకాగ్రత సాధించవచ్చని తెలిపారు. టెక్నాలజీ ఒక్కటే సంపదను సృష్టించదని, భారతదేశానికి ఉన్న అసలైన శక్తి సంస్కృతి, ఆధ్యాత్మికత అని అన్నారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ యువత ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో గ్యాస్ కొరత లేదన్న జెసి.
అన్నమయ్య జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, 31 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక పర్యవేక్షణ...
By Pagadala Venkateswar 2026-03-21 14:09:22 0 180
Andhra Pradesh
ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో 93 ఫిర్యాదులు
కర్నూలు సిటీ :కర్నూలు జిల్లా...విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ... డిఐజి, కర్నూలు...
By Hari Krishna 2026-01-19 11:44:38 0 184
Telangana
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్...
By Pinnehasan Odela 2026-01-19 11:13:05 0 312
SURAKSHA
Dial 112 Modernization Ensures Karnataka Police Reaches
Karnataka Police upgraded Dial 112 emergency service for faster help. Once you call, GPS traces...
By Kalaga Sailaja 2026-07-01 11:20:36 0 49
Andhra Pradesh
Pawan Kalyan: గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని నేనెప్పుడూ చెప్పలేదు: కల్తీ నెయ్యి వ్యవహారంపై పవన్ కల్యాణ్.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తాను...
By Pagadala Venkateswar 2026-02-24 09:59:36 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com