ప్లాన్ బితో మంగ్లీకి షాకిచ్చిన అడ్వకేట్ సుబ్బారావు.. ముదురుతున్న చీటింగ్ కేసు వివాదం!

0
137

ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ మోసం ఆరోపణలు ముదురుతున్నాయి. అడ్వకేట్ సుబ్బారావు బాధితుల తరపున పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 10 కోట్లకు పైగా మోసం జరిగిందని, ఇందులో మంగ్లీ తన సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని ప్రజలను నమ్మించారని ఆయన ఆరోపించారు. మంగ్లీ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ, ఇది తనను బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నమని ఎదురు ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా బాధితులు నేరుగా మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేయడంతో మంగ్లీకి ఇబ్బందులు తప్పేలా లేవు. పోలీసులు ప్రస్తుతం ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు.ప్రముఖ సింగర్ మంగ్లీ , అడ్వకేట్ సుబ్బారావు మధ్య సాగుతున్న వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రోజుకో ట్విస్టుతో సాగుతున్న ఈ కేసులో తాజాగా బాధితుల ఎంట్రీతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అడ్వకేట్ సుబ్బారావు ఈ కేసును పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు మంగ్లీ టీమ్‌కు షాక్ ఇస్తున్నాయి.మొదట అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ‘గోకుల నందన ఇన్‌ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. సుమారు 150 మంది బాధితుల నుంచి రూ. 10 కోట్లకు పైగా వసూలు చేశారని, దీని వెనుక మంగ్లీ, ఆమె సోదరుడు శివ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే మంగ్లీ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఏ పాపం తెలియదని, సుబ్బారావు కేవలం పబ్లిసిటీ కోసం తనను వాడుకుంటున్నాడని వాదించారు. అయితే ఈ వాదనను తిప్పికొడుతూ సుబ్బారావు బాధితులను నేరుగా మీడియా ముందుకు తీసుకొచ్చారు. బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటూ, తాము సామాన్య గృహిణులమని, నెట్‌వర్క్ మార్కెటింగ్ పేరుతో మధు అనే వ్యక్తి ద్వారా ఈ పెట్టుబడి మోసంలో చిక్కుకున్నామని తెలిపారు. 5 శాతం లాభం ఇస్తామని నమ్మించి తమ నుండి లక్షలాది రూపాయలు వసూలు చేశారని, ఆ డబ్బు తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంగ్లీ సోదరిని వివాహం చేసుకోబోయే వ్యక్తి ద్వారానే ఈ ఇన్వెస్ట్‌మెంట్ వివరాలు తమకు తెలిశాయని వారు పేర్కొనడం గమనార్హం.

Search
Categories
Read More
Telangana
భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం భీమారం...
By Pinnehasan Odela 2026-04-08 14:11:05 0 205
Telangana
ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం
ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాక సమావేశం హైదరాబాదులో ముదిరాజ్ ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్...
By MERIGE MALLESH 2026-04-01 13:04:54 0 1K
Telangana
దుండిగల్ పరిసరాల్లో గ్యాస్ కొరత ! హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం
దుండిగల్ (Dundigal) మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది....
By Ponnala Srinivasrao 2026-03-15 03:58:21 0 252
Andhra Pradesh
పొలిటికల్ పార్టీ లతో ఆర్డిఓ గారు సమావేశం
చీరాల: ఈరోజు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పొలిటికల్ పార్టీల...
By Gadiyapudi Narendra 2026-03-26 17:23:08 0 401
Tamilnadu
Tamil Nadu Launches 300 New Buses to Boost Connectivity
Tamil Nadu has strengthened its public transportation network with the launch of 300 new...
By Navya Sree 2026-06-25 13:03:32 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com