డి.ఎస్.బి.సి.యు చైర్మన్ కడియం మణికంఠ ను సన్మానించిన ఎమ్మెల్యే కొండయ్య

0
147

చీరాల 

ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ (డిఎస్ బీసీయూ )కు త్రిసభ్య కమిటీ చైర్మన్ గా కుంకలమర్రుకు చెందిన కడియం మణికంఠ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాధ్యత లు నిర్వహిస్తున్న త్రీమెన్ కమిటీ పదవీకాలాన్ని ఆరు నెలలపాటు కొనసాగిస్తూ ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం, 1964లోని సెక్షన్ 32 (7) (a)(i) ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది. కమిటీ చైర్మన్ గా కడియం మణికంఠ (కారంచేడు), సభ్యులుగా వై. పద్మావతి (కొణిజేడు, టంగుటూరు మండలం), కె. వెంకట కొండయ్య (వెంకటాయచెరువు, సీఎస్ పురం మండలం) కొ నసాగనున్నారు. ఈ సందర్భంగాత్రీమెన్ కమిటీ చైర్మన్ గా నియమితులైన కడియం మణికంఠ, సభ్యులకు ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య శుభాకాంక్షలు తెలిపారు. గొర్రెల పెంపకందారుల సంక్షేమం, అభ్యున్నతికి కమిటీ కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షిం చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశుసంవర్ధక రంగ అభివృద్ధిలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే కొండయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
స్వయంగా రక్తదానం చేసి సేవాస్పూర్తికి నిదర్శంగా నిలిచిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
గాలివీడు మండలం గాలివీడు టౌన్ లోని బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో సేవ భావం స్వచ్ఛంద సేవా సంస్థ...
By Benguluri Madhubabu 2026-06-13 08:21:43 0 137
Andhra Pradesh
నంద్యాల జిల్లా కొత్తపల్లి కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులులతో గడిపారు పిల్లలతో సరదాగా మాట్లాడి వారి ఆ అందిస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నారు
నంద్యాల జిల్లా కొత్తపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో గడిపాను....
By Chennaiah Kati 2026-06-20 08:34:53 0 63
SURAKSHA
: TN Police Taking Strict Action Against Drugs
TN Police Taking Strict Action Against DrugsContent: With the goal of a drug-free Tamil Nadu, the...
By Kalaga Sailaja 2026-06-27 10:35:20 0 119
Andhra Pradesh
మదనపల్లెలో ఉచిత హాకీ శిబిరం: 5-15 ఏళ్ల విద్యార్థులకు అవకాశం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురు హాకీ క్లబ్, ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల సహకారంతో సోమవారం...
By Pagadala Venkateswar 2026-05-05 06:25:52 0 102
Andhra Pradesh
లారీ ఢీకొని పోస్ట్‌మాస్టర్‌కు తీవ్ర గాయాలు
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని...
By Ratna Sekhar 2026-02-19 19:27:02 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com