ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కూటమి ప్రభుత్వంలో తక్షణమే పేదలకు వైద్యం

0
123

కూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం.

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

23 మందికి రూ.40.68 లక్షల ఎల్.ఓ.సీలు మంజూరు.

 

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 01.04.2026.

 

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు కూటమి నేతలతో కలిసి ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి)లను బుధవారం లబ్ధిదారులకు అందజేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ మార్చి 13 నుంచి 31వ తేదీ వరకు పంపిన అర్జీలకు గానూ 23 మందికి రూ.40,68,061ల విలువైన ఎల్.ఓ.సిలు మంజూరైనట్లు వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక సవాళ్ల మధ్య కూడా కూటమి ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన, సామాన్య వర్గాల పట్ల తన బాధ్యతను విస్మరించకుండా, వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 

 

కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం పనిచేస్తోందన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 

 

అనారోగ్యంతో బాధపడుతూ ఆపదల్లో ఉన్న కుటుంబాలకు సకాలంలో ఎల్.ఓ.సిలు అందడం వల్ల వారి తక్షణమే వైద్య సేవలు లభించి, జీవితంలో కొత్త వెలుగులు నింపుతున్నాయని లబ్ధిదారులు భావోద్వేగంతో తెలిపారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
అలిండియా అర్గానైజేషన్ అఫ్  కెమిష్ట్ డ్రాగిస్ట్(AIOCD) పిలుపు మెరాకు ఈరోజు దేశవ్యప్తంగ రిటైల్...
By Sadaq Sadaq 2026-05-20 13:41:56 0 43
Andhra Pradesh
పుంగనూరు: మత్సవతారంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు
పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం...
By Kothuru Murali 2026-03-02 04:07:45 0 99
Andhra Pradesh
పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు
రాజమండ్రి: చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో కీలకమని రాజమండ్రిలోని శ్రీ...
By Ratna Sekhar 2026-03-11 03:42:40 0 244
Andhra Pradesh
మదనపల్లెలో భవన నిర్మాణం మేస్త్రి అదృశ్యం.
మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన భవన నిర్మాణ మేస్త్రి సోమశేఖర్ శుక్రవారం నుంచి...
By Pagadala Venkateswar 2026-03-15 12:24:16 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com