ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కూటమి ప్రభుత్వంలో తక్షణమే పేదలకు వైద్యం

0
126

కూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం.

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

23 మందికి రూ.40.68 లక్షల ఎల్.ఓ.సీలు మంజూరు.

 

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 01.04.2026.

 

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు కూటమి నేతలతో కలిసి ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి)లను బుధవారం లబ్ధిదారులకు అందజేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ మార్చి 13 నుంచి 31వ తేదీ వరకు పంపిన అర్జీలకు గానూ 23 మందికి రూ.40,68,061ల విలువైన ఎల్.ఓ.సిలు మంజూరైనట్లు వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక సవాళ్ల మధ్య కూడా కూటమి ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన, సామాన్య వర్గాల పట్ల తన బాధ్యతను విస్మరించకుండా, వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 

 

కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం పనిచేస్తోందన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 

 

అనారోగ్యంతో బాధపడుతూ ఆపదల్లో ఉన్న కుటుంబాలకు సకాలంలో ఎల్.ఓ.సిలు అందడం వల్ల వారి తక్షణమే వైద్య సేవలు లభించి, జీవితంలో కొత్త వెలుగులు నింపుతున్నాయని లబ్ధిదారులు భావోద్వేగంతో తెలిపారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నార్త్ జోన్ పరిధిలో చోరీ ఐన 111 సెల్ ఫోన్ లు రికవరీ: బాధితులకు అందజేసిన డీసీపీ రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకోవడంతోపాటు చోరీకి గురైన కేసులలో పోలీసులు...
By Sidhu Maroju 2025-11-01 16:27:23 0 204
Andhra Pradesh
మదనపల్లె: దారికాసి పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి.
శుక్రవారం మదనపల్లెలో పారిశుద్ధ్య కార్మికురాలిపై దారికాసి దాడి జరిగింది. కుమారపురానికి చెందిన...
By Pagadala Venkateswar 2026-05-22 12:34:00 0 36
Telangana
నిజామాబాద్: సెక్యురిటీ కౌన్సిల్ అధ్వర్యoల్లో క్రికెట్ టోర్నమెంట్
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్.  యువకులు చదువుతోపాటు...
By Sadaq Sadaq 2026-04-20 16:12:04 0 92
Uttarkhand
Uttarakhand Landslides: Red Alert Issued as Heavy Rains Block Roads and Force Evacuations
Monsoon Damage: Heavy monsoon rains in Uttarakhand have triggered sudden landslides across many...
By Triveni Yarragadda 2025-08-11 14:49:51 0 2K
Andhra Pradesh
జర్నలిస్టు జేఏసీ. బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ
గూడూరు నగర పంచాయతీ లో గాంధీ జయంతి సందర్భంగా  ప్రతి ఒక్కరు గాంధీజీని స్మరించుకోవాలి :-...
By mahaboob basha 2025-10-02 10:38:48 0 363
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com