ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు....దొంగలు బాబోయ్‌ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు

0
75

ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు....దొంగలు బాబోయ్‌ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు

మధ్యప్రదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై ప్రకాశం, ఏలూరు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ధార్ జిల్లాకు చెందిన నిందితుల ముఠా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పలు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. చీరాలలో గతంలో చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ముఠాలతో ఈ గ్యాంగ్‌కు సంబంధాలు ఉండొచ్చన్న అనుమానంతో స్థానిక నేరస్థుల కదలికలపైనా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ చీరాల టూ టౌన్ సీఐ శశికుమార్ అనుమానితుల ఫొటోలతో పోస్టర్లను విడుదల చేశారు. పోస్టర్లలో ఉన్న వ్యక్తులు చోరీలు, దోపిడీ కేసుల్లో నిందితులని, వారి ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

పర్చూరులోనూ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్చూరు ఎస్‌ఐ పులి గోపి మాట్లాడుతూ, ధార్ గ్యాంగ్ కదలికలపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత కొనసాగుతోందని తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముగ్గురు అనుమానితుల కదలికలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో ఈ ముఠా కదలికలను గుర్తించి నేరాలను అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు

Search
Categories
Read More
Maharashtra
Maharashtra Strengthens Water Conservation and Irrigation
Maharashtra continues to enhance water conservation and irrigation through integrated watershed...
By Fathima Safa 2026-06-30 09:22:29 0 55
Andhra Pradesh
కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.
నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం  జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన...
By Pagadala Venkateswar 2026-05-04 06:13:24 0 104
Andhra Pradesh
ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేయాలి
ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూలు చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని...
By Boiena Rajesh 2026-03-03 12:56:23 0 194
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో మసీదులకు కొత్తూరు మురళి4.35లక్షలు అందజేసిన పెద్దిరెడ్డి
రంజాన్ మాసం సందర్భంగా, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే...
By Kothuru Murali 2026-03-15 10:27:00 2 357
Manipur
NIA Cracks Down on Manipur Violence with Key Arrests.
The National Investigation Agency (NIA) has arrested 10 individuals in connection with cases...
By Fathima Safa 2026-06-24 11:10:05 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com