ఏళ్ల తరబడి విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది డాక్టర్ల తొలగింపు

0
68

 

ఏళ్ల తరబడి విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది డాక్టర్ల తొలగింపు

18-06-2026 Thu 08:41

Andhra

Andhra Pradesh Government permanently terminates 43 doctors for unauthorized absence

ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు

వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని సహించబోమన్న‌ మంత్రి సత్యకుమార్

గత నెలలోనూ 51 మంది వైద్యులను తొలగించిన ప్రభుత్వం

మరో 118 మంది వైద్యులు అనధికారికంగా గైర్హాజరైనట్లు గుర్తింపు

ఏపీలో ప్రభుత్వ వైద్య సేవలను నిర్వీర్యం చేస్తున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏళ్ల తరబడి అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్య సేవల్లో బాధ్యతారాహిత్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఈ చర్యల ద్వారా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా వెల్లడించారు.

 

గత నాలుగేళ్లుగా ఈ 43 మంది వైద్యులు తమ విధులకు హాజరుకావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. దీనిపై వారికి పలుమార్లు సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది. వారిపై అభియోగాలు కూడా నమోదు చేసినప్పటికీ, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారిని సర్వీసుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు.

 

ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్-1964 ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఏడాదికి మించి అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే, వారిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ నిబంధనల ప్రకారమే ప్రస్తుతం ఈ 43 మందిపై వేటు వేసే ప్రక్రియను ఆరోగ్య శాఖ ప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని, విధులను విస్మరించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు.

 

ఇదే తరహాలో ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకుంటున్న రెండో పెద్ద చర్య ఇది. గత నెలలో కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 51 మందిని శాశ్వతంగా తొలగించారు. వీరిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉన్నారు. తాజా చర్యలతో పాటు మరో 34 మంది వైద్యులపై అభియోగాలు నమోదు చేసి నోటీసులు ఇవ్వగా, వారు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది.

 

ఇదిలా ఉంటే.. మరో ముగ్గురు ప్రొఫెసర్లపై కూడా త్వరలోనే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) పరిధిలో సుమారు 118 మంది వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వారిపై కూడా దశలవారీగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ వైద్య వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గొల్లగూడెంలో ట్రాక్టర్ ప్రమాదం – పనికి వెళ్తూ బాలిక దుర్మరణం
దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ బాలిక...
By Ratna Sekhar 2026-02-19 19:01:51 0 143
SURAKSHA
​. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రచారం
మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు తెలంగాణ పోలీసులు నిన్న పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన...
By Kalaga Sailaja 2026-06-27 06:25:54 0 42
Andhra Pradesh
గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం.
  గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం...
By Pagadala Venkateswar 2026-04-10 06:37:24 0 109
Gujarat
Patan District Demands Urgent Bush Clearance for Road Safety
Commuters and local residents in Gujarat’s Patan district are raising urgent demands for...
By Lokeshwari Panthadi 2026-06-27 08:38:47 0 84
Telangana
కార్పొరేషన్ సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ సమీక్షా సమావేశంలో...
By Avunoori Mahesh 2026-04-25 07:42:53 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com