భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ.

0
43

 

భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ

24-06-2026 Wed 09:34

Andhra

Kondrugunta Mahalakshmamma 94 year old woman renounces US citizenship to die as an Indian citizen

పుట్టిన గడ్డపై ప్రేమతో అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ

భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలన్నదే తన చివరి కోరిక అని వెల్లడి

బాపట్ల కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వృద్ధురాలు

దరఖాస్తును కేంద్ర హోంశాఖకు పంపుతామన్న కలెక్టర్ వినోద్‌కుమార్

అమెరికా నుంచి క్లియరెన్స్ రాగానే భారత పౌరసత్వం మంజూరు చేస్తామ‌ని వెల్ల‌డి

ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు కోసం యువతరం అమెరికా బాట పడుతున్న ఈ రోజుల్లో, 94 ఏళ్ల వృద్ధురాలు పుట్టిన గడ్డపై మమకారంతో అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. తన తుదిశ్వాసను భారత పౌరురాలిగా ఈ మట్టిలోనే విడవాలన్న బలమైన ఆకాంక్షతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ స్ఫూర్తిదాయక ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ (94) తన చివరి కోరికను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె కుమారుడు డాక్టర్ బుచ్చయ్య చౌదరి చాలాకాలం క్రితం అమెరికాలోని వర్జీనియాలో స్థిరపడ్డారు. భర్త నాగభూషణం మరణానంతరం మహాలక్ష్మమ్మ కూడా అమెరికా వెళ్లి, 2000 సంవత్సరంలో అక్కడి పౌరసత్వం పొందారు. అయితే, మాతృభూమిపై ఉన్న ప్రేమతో ఆమె 2018లో తన కుమారుడి కుటుంబంతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. గత ఎనిమిదేళ్లుగా ఆమె తన సొంతూరైన చింతగుంపలలోనే నివసిస్తున్నారు.

 

"నా కట్టె ఇక్కడే కాలాలి, పుట్టిన ఊరి మట్టిలోనే కలిసిపోవాలి" అన్నది మహాలక్ష్మమ్మ చివరి కోరిక. ఈ నేపథ్యంలో ఆమె తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గతంలో దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడంతో, వాటిని సరిదిద్ది తాజాగా మళ్లీ దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఆమె నిన్న‌ బాపట్ల కలెక్టరేట్‌కు హాజరయ్యారు.

 

జిల్లా కలెక్టర్ పి. వినోద్‌కుమార్ సమక్షంలో మహాలక్ష్మమ్మ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, దేశ చట్టాలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాలక్ష్మమ్మ ప్రమాణ పత్రంతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర హోంశాఖకు పంపిస్తామని తెలిపారు. అనంతరం కేంద్ర హోంశాఖ ఈ దరఖాస్తును అమెరికా ఎంబసీకి పంపుతుందని, అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే మహాలక్ష్మమ్మకు భారత పౌరసత్వం లభిస్తుందని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయితే, తన మాతృభూమిలో భారత పౌరురాలిగా జీవించాలన్న మహాలక్ష్మమ్మ చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

Search
Categories
Read More
Telangana
కొంపల్లి లో కళ్యాణ్ జ్యువెలర్స్ షో రూమ్ ను ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున మరియు నటి శ్రీ లీల
ఈ షోరూం  ప్రపంచ శ్రేణి వాతావరణంలో విలాసవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.  ఈ...
By Sidhu Maroju 2025-06-20 14:21:21 0 1K
Andhra Pradesh
అధికారులతో చర్చిస్తున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి...
By Boya Dasthagiri 2026-04-10 12:22:30 0 152
SURAKSHA
Prateek Jain IAS: Championing Good Governance
A Young Telangana IAS Officer Empowering Citizens with Transparent Administration and Inclusive...
By Lokeshwari Panthadi 2026-07-14 09:25:16 0 126
Andhra Pradesh
స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము
*స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యలు కావాలి:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2026-01-12 13:18:58 0 179
Andhra Pradesh
ఊర కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు.
శనివారం నిమ్మనపల్లి మండలంలోని గుండ్లబురుజు గ్రామంలో ఊర కుక్క దాడిలో కుందన్ (7) అనే బాలుడు...
By Pagadala Venkateswar 2026-06-21 07:34:04 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com