"మల్కాజ్‌గిరి అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే.|

0
111

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ జయగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో ఇస్కాన్ టెంపుల్ – శ్రీ గౌరంగ దాం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం సుమారు 1500 గజాల స్థలాన్ని కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. 

ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించి, భక్తులకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా మల్కాజ్‌గిరి డివిజన్ శివపురి కాలనీలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధి నుంచి మినహాయించి చారిటబుల్ ట్రస్ట్ కింద పరిగణించాలని కోరుతూ మరో వినతిపత్రాన్ని అందజేశారు.

ఓల్డ్ మల్కాజ్‌గిరిలోని శ్రీ విష్ణు దేవాలయానికి చెందిన స్థలంలో మున్నూరు కాపు భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని మంత్రిని అభ్యర్థించారు.

వినతిపత్రాలను స్వీకరించిన మంత్రి కొండా సురేఖ సంబంధిత అంశాలపై సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్, వెంకన్న, నవీన్ పాల్గొన్నారు. 

అలాగే ఇస్కాన్ టెంపుల్ – శ్రీ గౌరంగ దాం సేవా ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డితో పాటు సంస్థ ప్రతినిధులు, భక్తులు మరియు స్థానిక ప్రముఖులు హాజరయ్యారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పొన్నేటిపాలెంలో అర్ధరాత్రి వరకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం.
మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ పొన్నేటిపాలెం పంచాయతీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్...
By Pagadala Venkateswar 2026-07-09 04:49:28 0 59
Telangana
ప్రమాదంలో గాయపడిన పెగడపల్లి AMC డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడిని పరామర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెగడపల్లి ప్రాంతంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన AMC డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడిని...
By Avunoori Mahesh 2026-04-26 13:07:16 0 179
SURAKSHA
Bipul Pathak, IAS: A Visionary Administrator Driving Change
From Engineering Excellence to Administrative Leadership—How Bipul Pathak, IAS, Has...
By Lokeshwari Panthadi 2026-07-22 08:04:37 0 46
BMA
Fighting the Surge of Deepfakes in Election Coverage
With critical elections unfolding worldwide, reporters are facing an unprecedented wave of...
By Dunna Jessicaruth 2026-05-20 05:58:28 0 126
Andhra Pradesh
మదనపల్లెలో ట్రాక్టర్ ఢీ.. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజశేఖర్ (30) తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-05-22 12:40:36 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com