10వ తరగతి పాసైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ

0
104

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని,ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయని సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ అన్నారు.చందర్లపాడు మండలం కోనాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతిలో 31మంది విద్యార్థులకు గాను 30 మంది విద్యార్థులు పాస్ అయినారు.సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో 30 మంది పదవ తరగతి పాసైన విద్యార్థులకు సీల్డ్ తో పాటు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నగదు ప్రోత్సకాలను సోమవారం సొసైటీ బ్యాంకు లో అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కఠోర దీక్ష,నిరంతర సాధనను అలవర్చుకొని చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు.చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.విద్యార్థుల ఎదుగుదలలో కుటుంబం,కుటుంబాల ఎదుగుదలలో దేశం ఉండాలని కోరారు.ఏ కార్యక్రమంలో సొసైటీ బ్యాంక్ సిబ్బంది,స్కూల్ చైర్మన్ మార్కపూడి జాన్ కోటయ్య,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా డ్రోన్ కు దొరికేస్తాను జాగ్రత్త
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నేరగాళ్లపై పోలీసులు నిఘా పెంచారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అదేశాలతో...
By Pagadala Venkateswar 2026-01-15 07:59:33 0 148
Andhra Pradesh
ఏపీ వర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.. నేడే నోటిఫికేషన్ విడుదల.
వర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్...
By Pagadala Venkateswar 2026-05-15 06:11:09 0 51
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com