"మల్కాజ్‌గిరి అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే.|

0
110

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ జయగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో ఇస్కాన్ టెంపుల్ – శ్రీ గౌరంగ దాం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం సుమారు 1500 గజాల స్థలాన్ని కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. 

ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించి, భక్తులకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా మల్కాజ్‌గిరి డివిజన్ శివపురి కాలనీలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధి నుంచి మినహాయించి చారిటబుల్ ట్రస్ట్ కింద పరిగణించాలని కోరుతూ మరో వినతిపత్రాన్ని అందజేశారు.

ఓల్డ్ మల్కాజ్‌గిరిలోని శ్రీ విష్ణు దేవాలయానికి చెందిన స్థలంలో మున్నూరు కాపు భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని మంత్రిని అభ్యర్థించారు.

వినతిపత్రాలను స్వీకరించిన మంత్రి కొండా సురేఖ సంబంధిత అంశాలపై సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్, వెంకన్న, నవీన్ పాల్గొన్నారు. 

అలాగే ఇస్కాన్ టెంపుల్ – శ్రీ గౌరంగ దాం సేవా ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డితో పాటు సంస్థ ప్రతినిధులు, భక్తులు మరియు స్థానిక ప్రముఖులు హాజరయ్యారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
వెంకటాపురం కాలనీలో చెత్త అసాంఘిక కార్యకలాపాలతో నివాసితుల ఇబ్బందులు
మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.    జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్...
By Sidhu Maroju 2025-08-04 12:42:56 0 825
Business & Finance
Is GST Composition Scheme Right for Your Business
The GST Composition Scheme is designed for eligible small businesses seeking a simpler way to...
By Navya Sree 2026-07-17 06:43:39 0 37
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : పిడుగుపాటుకు వృద్ధుడు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని గొంగివారిపల్లె పంచాయతీ, పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య...
By Kothuru Murali 2026-05-17 17:41:22 0 76
Andhra Pradesh
Chandrababu Naidu: పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు 30-01-2026 Fri...
By Pagadala Venkateswar 2026-01-31 06:23:21 0 282
Madhya Pradesh
Major Industrial Boost: Adani Group to Build Cement Plant in Guna
Madhya Pradesh’s industrial landscape is set for a massive upgrade following Chief Minister...
By Dunna Jessicaruth 2026-05-18 08:32:36 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com