దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి

0
282

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి

హనుమకొండ, జూలై 8:జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బుధవారం న్యూఢిల్లీ నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొని, భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.

హనుమకొండ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి, జిల్లాలో దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం మిగిలి ఉన్న సుమారు 42.34 ఎకరాల భూమి సేకరణకు వేగవంతమైన చర్యలు చేపట్టామని, సంబంధిత రైతులతో సమన్వయం చేస్తూ భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, పర్యవేక్షకులు జగత్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Upholding Integrity: The Puducherry Police PoP Unit Explained
The "Policing of Police" (PoP) unit represents a cornerstone of institutional integrity within...
By Lokeshwari Panthadi 2026-07-03 08:36:57 0 57
Andhra Pradesh
జిల్లాలో జల వనరుల పెంపుకు సమగ్ర కార్యాచరణ: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచేందుకు సమగ్ర కార్యాచరణ...
By Pagadala Venkateswar 2026-06-24 04:24:31 0 43
Andhra Pradesh
బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన
బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-02-18 14:03:18 0 297
Andhra Pradesh
మదనపల్లి: నిందితుడిపై పిడిగుద్దులు.. అదుపుతప్పిన పరిస్థితి.
మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి ఇంటి వద్దకు మంగళవారం వేలాది మంది స్థానికులు తరలివచ్చారు....
By Pagadala Venkateswar 2026-02-17 11:45:43 0 154
Andhra Pradesh
జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగ వాసి ప్రసాద్ బాబు
కువైట్ జనసేన పార్టీ కువైట్ కార్యవర్గం ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కువైట్ ఎన్నారై టిడిపి కువైట్...
By Benguluri Madhubabu 2026-05-16 12:01:57 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com