ఆసిఫాబాద్‌లో ఇంధన కష్టాలు పట్టించుకునేవారే లేక గంటల తరబడి రైతులు, ట్రాక్టర్ యజమానులు, వాహనదారుల అరిగోస

0
209

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డీజిల్ కొరత సెగ తీవ్రరూపం దాల్చగా, మెజారిటీ పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు అయిపోయి నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో ప్రస్తుతం డీజిల్ లభిస్తున్న ఏకైక ⁠ఇండియన్ ఆయిల్ (IndianOil) బంకు వద్దకే జిల్లా నలుమూలల నుండి వందలాది వాహనాలు ఒక్కసారిగా పోటెత్తాయి. ప్రస్తుతం వ్యవసాయ రబీ కోతలు, సాగు పనులు పీక్ స్టేజ్‌లో ఉండటంతో ట్రాక్టర్ యజమానులు, రైతులు, ఆటో డ్రైవర్లు మరియు నిత్యావసర రవాణా వాహనదారులు భారీ సంఖ్యలో తరలివచ్చి తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడ్డారు. ఇంతటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎండలో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా తమ కష్టాన్ని మరియు ఈ అస్తవ్యస్త పరిస్థితిని క్షేత్రస్థాయిలో పట్టించుకునేవారే కరువయ్యారని రైతులు, వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఎలాంటి గొడవలు జరగకుండా వాహనదారులు స్వచ్ఛందంగా ఎంతో క్రమశిక్షణతో, ఓపికతో సంయమనం పాటిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఇంధనాన్ని నింపుకుంటున్నారు,  కాగా, ఈ రద్దీ తాత్కాలికమేనని, సోషల్ మీడియా పుకార్లను నమ్మి కంగారు పడవద్దని, డిపోల నుండి రవాణా ఇబ్బందులను అధిగమించి సరఫరాను సాధారణ స్థితికి తెస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమవ్వడం గమనార్హం.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో బాలుడికి కాఫీ పడడంతో గాయాలు.
మదనపల్లిలో మంగళవారం రామాంజులు, రాణెమ్మ దంపతులు అద్దె ఇల్లు ఖాళీ చేసే సమయంలో, రాణెమ్మ తయారు చేసిన...
By Pagadala Venkateswar 2026-05-06 06:53:59 0 96
SURAKSHA
"Sindhu Pillai A., IPS: Safeguarding Andaman with Vision"
An accomplished IPS officer leading law & order, intelligence, disaster management, and...
By Lokeshwari Panthadi 2026-07-24 07:01:52 0 26
Telangana
మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం...
By Pinnehasan Odela 2026-02-24 11:42:49 0 233
Andhra Pradesh
ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎం వి ఐ సుప్రియ
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వాహనదారులతో అవగాహన సదస్సును శనివారం...
By Kothuru Murali 2026-01-04 11:12:06 0 194
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: పిచ్చికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో సోమవారం చెరుకువారిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల మస్తాన్ అనే...
By Kothuru Murali 2026-03-31 05:16:56 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com