"డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? – కాలనీవాసుల ప్రశ్నలు.|

0
111

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని బొల్లారం సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్-14లో డ్రైనేజ్ సమస్య స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 

గత కొన్ని రోజులుగా మురుగు నీరు పొంగిపొర్లుతూ రహదారిపైకి చేరుతుండటంతో కాలనీవాసులు దుర్వాసన, దోమల బెడదతో అసహనానికి గురవుతున్నారు.

డ్రైనేజ్ నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఆరోగ్యపరమైన సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని వారు చెబుతున్నారు.

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకుని డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని, రహదారిపై నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. 

సమస్య మరింత తీవ్రం కాకముందే సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న ముగ్గురు వ్యక్తులకు కుక్క అడ్డం రావడంతో ప్రమాదం జరిగింది
గురువారం పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలోని పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న...
By Kothuru Murali 2026-01-09 12:49:15 0 147
Andhra Pradesh
అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు.
మదనపల్లికి చెందిన కార్ల వ్యాపారి ఖాదరవల్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్వాతంత్ర్య సమరయోధుడు వీర...
By Pagadala Venkateswar 2026-03-31 03:32:22 0 126
Telangana
Elections in telangana
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్...
By G k Nookala 2026-02-09 18:02:17 0 337
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com