నూతన బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

0
618

హనుమకొండ జిల్లాలోని పరకాల నుంచి శాయంపేట మీదుగా సాధనపల్లి వరకు నూతన బస్సు సేవ ప్రారంభమైంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజా విజ్ఞప్తి మేరకు ఈ సేవను మంజూరు చేయించి శనివారం ఉదయం మండలకేంద్రంలో ఘనంగా జెండా ఊపి ప్రారంభించారు.ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ఈ సౌకర్యం విద్యార్థులకు, స్థానిక ప్రజలకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, చిరు వ్యాపారులకు, పట్టణాలకు అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని కొన్ని గ్రామాల మధ్య సరైన ప్రభుత్వ రవాణా లేకపోవడం వల్ల గతంలో ప్రజలు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేదని దీని వలన ఖర్చు, సమయం అధికంగా ఉండేదని కావున సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా,ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా ఈ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్టు,కావున ప్రజలు ఆర్టీసీ సేవలను వియోగించుకుని తద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లి తమ వంతు సహకారాన్ని కూడా అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, M.P.D.O ఫణిచంద్ర, మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చల్లా చక్రపాణి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపెల్లి రవీందర్, మస్కే కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి కుటుంబం సర్వేకు సహకరించాలి: కాకినాడ కమిషనర్
కాకినాడ నగరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వే కొనసాగుతోంది. గురువారం నరసన్ననగర్...
By Ratna Sekhar 2026-02-19 20:08:35 0 1K
Telangana
మే 29న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు గవర్నర్ రాక
🎤భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ మరియు రౌతసంకెపల్లి...
By Chunarkar Jagadeesh 2026-05-28 17:25:33 0 380
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో శుక్రవారం రాత్రి నాగుపాము కనిపించడంతో...
By Kothuru Murali 2026-06-13 15:49:49 0 72
SURAKSHA
G. Jayalakshmi, IAS: A Trailblazer in Public Administration
A Distinguished Civil Servant Driving Inclusive Governance, Women Empowerment, and Administrative...
By Lokeshwari Panthadi 2026-07-13 08:13:18 0 98
Andhra Pradesh
బోయకొండ అటవీ ప్రాంతంలో వ్యక్తి హత్య
చౌడేపల్లి మండలం బోయకొండ పరిసర అటవీ ప్రాంతంలో వ్యక్తిని హత్య చేసిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల...
By Kothuru Murali 2026-04-07 05:35:04 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com