ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి: బండి రమేష్

0
524

మియాపూర్, జూన్ 5 (న్యూస్ డెస్క్): తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు మియాపూర్‌లో పర్యటించనున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తెలిపారు. రూ.161 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవనానికి భూమిపూజతో పాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు.

శుక్రవారం మియాపూర్‌లో కార్యక్రమ స్థలాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించిన బండి రమేష్, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.

 

ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ , రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొలను హనుమంత రెడ్డి , శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జగదీశ్వర్ గౌడ్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలని బండి రమేష్ పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సమాన జీతం - శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
దిన కూలీలకు.హోటల్ లో పని చేసేవారికి. టైం స్కే ఎల్. మధ్యాహ్న భోజన కార్మికులు. అంగన్వాడీ...
By Mobbu Venkatramana 2026-03-02 12:59:37 0 225
Telangana
4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతాం.
తేదీ 01/04/2026 రోజు బ్లాక్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-04-01 13:54:23 0 716
Andhra Pradesh
కబడ్డీ పోటీల నిర్వహణ:
క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ABM చర్చ్ ఆధ్వర్యంలో...
By Hari Krishna 2025-12-27 16:13:13 0 196
Telangana
జిల్లా కలెక్టర్ ఈరోజు గ్రామసభలో దుగ్గొండి మండలంలో వరంగల్ జిల్లాలో
భారత్ అవాజ్ న్యూస్: 6జూన్ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ఈరోజు గ్రామసభవరంగల్ జిల్లా దుగ్గొండి మండల...
By Gujile Ramu 2026-06-06 08:08:12 0 158
Andhra Pradesh
మదనపల్లిలో నీటి భద్రత కార్యక్రమం ప్రారంభం.
మదనపల్లె చీగలబైలు పంచాయతీలోని వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ పనులను ఎమ్మెల్యే షాజహాన్, ఏఎంసీ...
By Pagadala Venkateswar 2026-04-08 05:55:48 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com