బీసీ బందుకు మద్దతు పలికిన ఆర్టీసీ కార్మికులు — సంఘీభావం తెలిపిన ఈటెల

0
194

సికింద్రాబాద్:  బీసీ సంఘాల పిలుపుమేరకు ఈరోజు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర బందులో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్. బీసీ బంద్ కు మద్దతు పలుకుతూ ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి బస్సులను బందు పెట్టారు. కార్మికులు డిపోలకు మాత్రమే పరిమితమయ్యారు. జూబ్లీ బస్ స్టేషన్ డిపోలో డ్రైవర్లు కండక్టర్లు ఆర్టీసీ కార్మికులను కలిసిన ఎంపీ ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ ఉద్యమంలో సైతం ఆర్టీసీ పాత్ర మరువలేనిధి అని ఆయన అన్నారు. ఆర్టీసీకి దసరా పండుగ అంటే ఎక్కువ డబ్బులు వచ్చేది అయినా ఉద్యమ సమయంలో దసరా పండుగ సైతం బస్సులు బంద్ పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ప్రతి ఆర్టీసీ కార్మికులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు బిసి బందుకు మద్దతు తెలిపిన ఆర్టీసీ కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాలు మారిన ఆర్టీసీ కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదని హామీలు ఇవ్వడం తప్ప వాటిని నెరవేర్చడం లేదని వాటి మీద కూడా పోరాటం చేయాలని ఈటలని కోరుకున్న ఆర్టీసీ కార్మికులు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
అల్వాల్ లో వర్షాల వల్ల నీటి మునక - జిహెచ్ఎంసి హైడ్రా బృందం తక్షణ స్పందన
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ 133 డివిజన్ పరిధిలోని తుర్కపల్లి బొల్లారం యూ.ఆర్.బి....
By Sidhu Maroju 2025-09-16 09:13:17 0 180
Telangana
హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో దారుణం.|
హైదరాబాద్ – పేట్ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ...
By Sidhu Maroju 2025-12-23 11:59:58 0 113
Andhra Pradesh
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన...
By Pagadala Venkateswar 2026-02-11 13:10:46 0 21
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com