చింతూరు: పొల్లూరు జలపాతంలో ప్రమాద వశత్తు నీటిలో మునిగి యువకుడి మృతి!

0
183

చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొల్లూరు జలపాతం వద్ద ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన అఖిల్ (22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పొల్లూరు జలపాతాన్ని సందర్శించడానికి వచ్చాడు. అందరూ కలిసి జలపాతం అందాలను ఆస్వాదిస్తూ, నీటిలో కేరింతలు కొడుతున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. అఖిల్ ప్రమాదవశాత్తు జలపాతంలోని లోతైన నీటి గుండంలో పడి మునిగిపోయాడు.కళ్లముందే అఖిల్ నీటిలో మునిగిపోతుండడం గమనించిన స్నేహితులు వెంటనే అతడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. నీటిలో మునిగి ఊపిరాడక అఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు స్థానికులు నిర్ధారించారు.కళ్లముందే ప్రాణస్నేహితుడు శవంగా మారడంతో తోటి స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మొతుగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
"మత్తు ఒక క్షణం... నష్టం జీవితాంతం!
"నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం" హైదరాబాద్ :మాదకద్రవ్యాల వినియోగం...
By Sidhu Maroju 2026-06-26 07:17:11 0 116
Manipur
Manipur Advances Digital Governance and Public Services
Manipur continues to strengthen its digital governance ecosystem by expanding online public...
By Fathima Safa 2026-07-03 16:11:11 0 42
Manipur
Manipur Boosts Environment and Forest Conservation Efforts
Manipur continues to strengthen environmental protection and forest conservation through...
By Fathima Safa 2026-07-01 10:28:27 0 62
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ గుర్తించలేదు
అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో సదుం మండలం మినహా మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ...
By Kothuru Murali 2026-02-12 05:43:23 0 162
Technology
సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి: జేవీవీ రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్
భారత్ అవాజ్ | హుజూర్‌నగర్   విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని...
By Malla Rambabu 2026-07-18 01:32:03 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com