"అల్వాల్ ఫైర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్ దిశగా అడుగులు.. అధికారులతో ఎమ్మెల్యే చర్చలు.|

0
210

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రత్యేక వినతిపత్రాలను అందజేశారు.

అల్వాల్ ప్రాంత ప్రజల భద్రతకు అత్యంత అవసరమైన ఫైర్ స్టేషన్ నిర్మాణ అంశాన్ని ఎమ్మెల్యే ప్రధానంగా ప్రస్తావించారు. 

అల్వాల్ గ్రామ కంఠం స్థలంలో 11 గుంటల భూమిని ఫైర్ స్టేషన్ కోసం కేటాయించే ప్రక్రియకు సంబంధించిన ఎమ్మార్వో లేఖలు, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదించిన తీర్మాన పత్రాలను కమిషనర్‌కు అందజేశారు. 

ఫైర్ స్టేషన్ నిర్మాణంపై నెలకొన్న అపోహలను తొలగించి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పనులను వేగవంతం చేయాలని కోరారు.

అదేవిధంగా చాణిక్యపురి పార్క్ అభివృద్ధి, నియోజకవర్గంలోని పార్కులను ఆధునీకరించి ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు, బండ చెరువు అభివృద్ధి, చెరువులకు సంబంధించిన న్యాయపరమైన వివాదాల పరిష్కారం అనంతరం అభివృద్ధి పనుల ప్రారంభం, పలు కాలనీల్లో బాక్స్ డ్రైన్లు మరియు సీసీ రోడ్ల నిర్మాణం, అలాగే ఆర్కేఎచ్ కాలనీలోని పార్కు స్థల పరిరక్షణ వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారు. 

సంబంధిత అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎంఎంసీ చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి, ఇంజనీరింగ్ ప్రాజెక్టు అధికారులు, మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Business & Finance
Removing a Director - Avoid Legal Mistakes That Cost
Removing a director from a company is a significant legal process that must comply with the...
By Navya Sree 2026-07-09 06:56:34 0 79
Andhra Pradesh
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు అవసరం
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డీడీఓ కిరణ్ కుమార్ అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-07 04:49:10 0 191
Andhra Pradesh
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు  రేణిగుంట, జూలై 3 : తిరుపతి జిల్లా పర్యటన...
By Chennaiah Kati 2026-07-03 16:58:11 0 55
Andhra Pradesh
హోమ్ స్టే అభివృద్ధిపై పర్యాటకశాఖ మంత్రిత్వ శాఖను ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్
*ప్ర‌చుర‌ణార్థం* *15-12-2025*   *ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో...
By Rajini Kumari 2025-12-16 08:09:10 0 180
Andhra Pradesh
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకచీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్...
By Vadlamudi NagaVenkat 2026-03-09 09:48:16 0 737
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com