నేషనల్ క్రికెట్ లీగ్‌కు బాబాపూర్ గిరిజన యువకుడు ఎంపిక!

0
448

🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ (కుమరం భీమ్ జిల్లా):

కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి మరో క్రీడా కెరటం మెరిసింది. ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు బాదావత్ శ్రీ చంద్ నాయక్ ప్రతిష్టాత్మక 'నేషనల్ క్రికెట్ లీగ్' (National Cricket League) కు ఎంపికయ్యాడు.ప్రతిభ చాటిన శ్రీ చంద్ హైదరాబాద్‌లోని సెంచూరియన్ మైదానంలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అండర్-16 (U-16) క్రికెట్ క్రీడాకారుల కోసం మూడు రోజుల పాటు ఎంపిక పోటీలు (ట్రయల్స్) నిర్వహించారు. ఈ సెలెక్షన్స్‌లో శ్రీ చంద్ నాయక్ అద్భుతమైన ప్రతిభను కనబర్చి సెలెక్టర్ల ప్రశంసలు అందుకున్నాడు. అత్యుత్తమ ప్రదర్శనతో నేషనల్ లీగ్‌కు తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. బాబాపూర్ గ్రామానికి చెందిన బాదావత్ శివప్రసాద్, రజిత దంపతుల చిన్న కుమారుడైన శ్రీ చంద్ నాయక్ జాతీయ స్థాయి లీగ్‌కు ఎంపిక కావడం పట్ల స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుండి, అదీ ఒక గిరిజన యువకుడు జాతీయ స్థాయికి ఎంపికవడం గర్వకారణమని గ్రామస్తులు శ్రీ చంద్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు మీడియాతో
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్...
By Chennaiah Kati 2026-07-17 07:20:15 0 44
Telangana
అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే
అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...
By Pinnehasan Odela 2025-12-29 15:04:09 0 227
Andhra Pradesh
కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ప్రారంభం :
కర్నూలు సిటీ :  కలెక్టర్ కార్యాలయంలో  స్పెషల్ కంట్రోల్ రూమ్  నూతన గదిని...
By Hari Krishna 2025-12-31 11:29:48 0 202
Andhra Pradesh
విజయవాడ పింఛన్ అందించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
*విజయవాడ నగరపాలక సంస్థ* *31-12-2025*     *పింఛను లబ్దిదారులకు పింఛను అందించిన...
By Rajini Kumari 2025-12-31 10:51:20 0 241
Telangana
SI's charity for children who lost their mother!
MAHABUBABAD/KOTHAGUDA::Manemma, a resident of Kothaguda Mandal Center, recently passed away due...
By Bheeshman King 2026-07-03 07:55:18 0 277
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com