నేషనల్ క్రికెట్ లీగ్‌కు బాబాపూర్ గిరిజన యువకుడు ఎంపిక!

0
447

🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ (కుమరం భీమ్ జిల్లా):

కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి మరో క్రీడా కెరటం మెరిసింది. ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు బాదావత్ శ్రీ చంద్ నాయక్ ప్రతిష్టాత్మక 'నేషనల్ క్రికెట్ లీగ్' (National Cricket League) కు ఎంపికయ్యాడు.ప్రతిభ చాటిన శ్రీ చంద్ హైదరాబాద్‌లోని సెంచూరియన్ మైదానంలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అండర్-16 (U-16) క్రికెట్ క్రీడాకారుల కోసం మూడు రోజుల పాటు ఎంపిక పోటీలు (ట్రయల్స్) నిర్వహించారు. ఈ సెలెక్షన్స్‌లో శ్రీ చంద్ నాయక్ అద్భుతమైన ప్రతిభను కనబర్చి సెలెక్టర్ల ప్రశంసలు అందుకున్నాడు. అత్యుత్తమ ప్రదర్శనతో నేషనల్ లీగ్‌కు తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. బాబాపూర్ గ్రామానికి చెందిన బాదావత్ శివప్రసాద్, రజిత దంపతుల చిన్న కుమారుడైన శ్రీ చంద్ నాయక్ జాతీయ స్థాయి లీగ్‌కు ఎంపిక కావడం పట్ల స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుండి, అదీ ఒక గిరిజన యువకుడు జాతీయ స్థాయికి ఎంపికవడం గర్వకారణమని గ్రామస్తులు శ్రీ చంద్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Business & Finance
ESI Registration for Employee Health and Security
ESI Registration helps eligible businesses provide medical, sickness, maternity, disability, and...
By Navya Sree 2026-07-21 05:42:22 0 19
SURAKSHA
Karnataka Police Today: Fighting Social Evils Brave
Today Karnataka police officers fought against social evils across state. Village meetings held...
By Kalaga Sailaja 2026-07-04 07:23:02 0 32
Business & Finance
Start Your Public Company Registration in India Today
Registering a Public Limited Company in India enables businesses to raise capital, enhance...
By Navya Sree 2026-07-14 05:47:43 0 40
SURAKSHA
G. Sai Prasad, IAS: Excellence in Public Governance
A Leader Committed to Good Governance "Effective governance is measured not by policies alone,...
By Lokeshwari Panthadi 2026-07-13 09:44:02 0 73
Andhra Pradesh
కర్నూలు మెడికల్ కాలేజీలో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు !!
కర్నూలు : కర్నూలు మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సాయంతో రూ.50 కోట్లతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు...
By Hari Krishna 2025-12-27 16:10:48 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com