"బస్తీల బాట పట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్.. నవ కంటోన్మెంట్ లక్ష్యంగా క్షేత్రస్థాయి పర్యటన".|

0
108

మేడ్చల్–మల్కాజిగిరి : జిల్లాలో నవ కంటోన్మెంట్ నిర్మాణ లక్ష్యంతో అభివృద్ధి పనులకు మరింత వేగం తీసుకురావాలని సంకల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బుధవారం బొల్లారం పరిధిలోని జనప్రియ బంగ్లా, శాంతి నగర్ కాలనీ, గడ్డి బస్తీలలో విస్తృతంగా పర్యటించారు.

సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బస్తీల్లో కాలినడకన పర్యటించిన ఎమ్మెల్యే, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. 

డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, కమ్యూనిటీ హాళ్ల అవసరం వంటి పలు మౌలిక వసతుల అంశాలపై స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, నవ కంటోన్మెంట్ నిర్మాణం కేవలం నినాదంగా కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే అభివృద్ధి కార్యక్రమంగా నిలవాలని తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రాంతంలోని మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించి ప్రజలకు మెరుగైన జీవన వాతావరణాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. 

ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వానికి, తమ ప్రజాప్రతినిధిత్వానికి ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో కాలనీల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, నాని, రామచంద్రారెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో బస్తీవాసులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే డిపిఆర్ కోసం టెండర్స్
*ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే డీపీఆర్ కోసం టెండర్స్*    ఫ్యూచర్ సిటీ నుంచి...
By Rajini Kumari 2025-12-31 10:22:16 0 179
BMA
Local Newsrooms Turn to Non-Profit Models for Survival
As traditional advertising revenues continue to dry up globally, local reporters are finding a...
By Dunna Jessicaruth 2026-05-20 06:03:31 0 46
Andhra Pradesh
టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల డబ్బు కేటాయించాలని డిమాండ్
ప్రచురణార్థం. 10/4/2026 టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం...
By Rajini Kumari 2026-04-10 11:46:48 0 102
Andhra Pradesh
పుంగునూరు లో కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా పుంగునూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి...
By Kothuru Murali 2026-02-10 07:31:56 0 185
Telangana
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
    మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి...
By Pinnehasan Odela 2026-03-09 13:09:17 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com